Friday, May 15, 2026

వాయుపుత్రుని వినయశీలములు - స్వామి సుందర చైతన్యానంద

 వాయుపుత్రుని వినయశీలములు - స్వామి సుందర చైతన్యానంద

“హనుమా! నీకు నేను ఇచ్చిన వస్తువును 

చూడగానే రామునికి ఆనవాలు బాగా

తెలుస్తుంది. చూడామణిని చూడగానే 

కౌసల్యాదశరథులు, నేను రామునికి జ్ఞాపకము

వస్తాము. నాయనా! నా విషయంలో ఏమేమి 

చేయాలో అంతా నీవే ఆలోచించాలి.

త్వ మస్మిన్ కార్య నిర్యోగే 

ప్రమాణం హరిసత్తమ

హనుమన్ యత్న మాస్థాయ 

దుఃఖ క్షయకరోభవ ||

“హనుమంతుడా! ఈ 

కార్యనిర్వహణలో నీవే 

ఆలోచించాలి. 

నీ ప్రయత్నముతో నాదుఃఖాన్ని

 పోగొట్టు" అన్నది సీతమ్మ. తథేతి -

 "అలాగే" అన్నాడు హనుమంతుడు.

ఇక్కడ నాదొక్క (పూజ్య  శ్రీ సుందర చైతన్యానందుల 

వారి)సలహా. జీవితమొక భయంకర సంగ్రామము. 

ఎప్పుడు, ఏవైపునుండి,ఏవిధమైన కష్టా లొస్తాయో,

దుఃఖా లొస్తాయో తెలియదు. వాటిని పోగొట్టుకొనే 

ప్రయత్నంలోమనం ఎంతో శ్రమిస్తూ ఉంటాము.

మీకు కష్టాలు వచ్చినప్పుడు గాని, బాధలు 

ఎదురైనపుడు గాని, సమస్యలు భయం

కరంగా తలెత్తినపుడు గాని, వాటి పరిష్కారానికి 

వారు యత్నించబోయే ముందు, హనుమంతుని 

మనసులో భక్తితో ప్రార్థించి, పై శ్లోకాన్ని మూడుసార్లు 

ధ్యానించండి. తరువాత మీప్రయత్నాన్ని సాగించండి. 

ఆంజనేయుడు మీకు అండగా ఉండి మీ కార్యాన్ని సఫలీకృతం

చేస్తాడు.దేనికైనా విశ్వాస ముండాలి. విశ్వాసము పర్వతాల్ని కదిలిస్తుంది. సాగరచలనాన్నినిరోధిస్తుంది. 

సూర్యచంద్రుల గమనాన్ని అడ్డగిస్తుంది.

కార్యభారాన్ని స్వీకరించమని, దుఃఖాన్ని పోగొట్టమని 

సీతమ్మ ప్రార్థించగానే హనుమంతుడు“తథేతి" "అలాగే" అన్నాడు. అంతకన్నా మనకు ఏమికావాలి? మారుతి మాటను విశ్వసించి

మనుగడను మహోన్నతంగా తీర్చిదిద్దుకుందాం.

పూజ్య  శ్రీ సుందర చైతన్యానందుల వారు 

నిజాం కాలేజీ రామాయణ ప్రవచన

 ” యజ్ఞ ప్రసాదం “ గా భక్తులకు అందించినారు.


ద్వాదశాక్షర మంత్ర స్తోత్రము మూలం: వేదవ్యాస మహర్షి వ్యాఖ్య: స్వామి సుందర చైతన్యానంద #తెలుగు వికీపీడియా LINK

ద్వాదశాక్షర మంత్ర స్తోత్రము 
 మూలం: వేదవ్యాస మహర్షి 
వ్యాఖ్య: స్వామి సుందర చైతన్యానంద 
 తెలుగు వికీపీడియా LINK: CLICK HERE
GOOGLE DRIVE PDF LINK: CLICK HERE

 




కలియుగము ప్రబల దోషయుత మైనను దాని 

నివారణము కూడా కలియుగము - నందే కలదని శుకమహర్షి భాగవతంలో పరీక్షిన్మహారాజుకు చెబుతాడు. 

కలి దోషముల నన్నింటిని భగవన్నామము హరిస్తుందని ప్రవచిస్తాడు.

  “ఓం నమో భగవతే వాసుదేవాయ” 

ఈ పవిత్ర మంత్రం కలి దోషాలను హరిస్తుంది. వాతావరణాన్ని శుద్ధి చేస్తుంది. బుద్ధిని శుద్ధి పరుస్తుంది. మనసులోని మాలిన్యాన్ని తొలగిస్తుంది. హృదయాన్ని తేలిక పరుస్తుంది.

హరిః సదా వసే తత్ర యత్ర భాగవతా 

జనా:గాయని భక్తి భావేన హరేర్నామైవ 

కేవలమ్ భక్తులు గుమిగూడి ఎచ్చట హరినామమును గానము చేయు చుందురో అచ్చట శ్రీహరి వసించుచుండును.

నామమున్నచోట నారాయణుడుంటాడు. నామము మనకు నామిని ప్రసాదిస్తుంది. స్వామిని ప్రసాదిస్తుంది. నారాయుణు డున్నచోట నరకముండదు. జనార్దన నామంతో జగడాలు దూరమౌతాయి. హరినామంతో హత్యలు అదృశ్యమవుతాయి. కృష్ణనామంతో తృష్ణ నశిస్తుంది. రామనామంతో కామం పలాయన మౌతుంది. భవరోగాలకు భీతి చెందకండి. భగవన్నామం భయాలను భయ పెడుతుంది.

వాతావరణ కాలుష్యం పోవాలా ?

ఇంటి చుట్టూ తులసి మొక్కలు పెంచండి. ఆంతర్య కాలుష్యం తొలగాలా ? అచ్యుతుని నామాన్ని గానం చేయండి. - ఏ కులంవా రెనా చేయవచ్చు. ఏ మతం వారైనా చేయవచ్చుకుళ్ళు సృష్టించినకులాలు కుళ్ళిపోనీ..

ముళ్ళు పరచిన మతాలు మరలిపోనీ. కులాలు మనకొద్దు. అనుకూలమే మన కులం....... మతాలు మనకొద్దు. సమ్మతమే మన మతం..........

నవ సమాజ నిర్మాణానికి నడుం కట్టండి.

కలి పురుషుని ఆగడాలకు కళ్ళెం వేయండి. మంచితనానికి మనిషి తనానికి శుభ పరిణామం ఈ సమయం. కలసి కట్టుగా నామం చేద్దాం ప్రభునామానికి నియమం లేదు....

బుధజన సేవలో

సుందర చెతన్యాశ్రమం గాంధీ జయంతి

ధవళేశ్వరం 2-10-193


.


Tuesday, May 12, 2026

వేదసంస్కృతి - ఓం నమో భగవతే వాసుదేవాయ

 

ఓం నమో భగవతే వాసుదేవాయ ! ఈ మంత్రం ఎందుకు జపించాలి.? ఇప్పటికి సరిగ్గా 1500 సంవత్సరాల క్రితం సంఘటన. ఒక ముసలివాడు ”ఓం నమో భగవతే వాసుదేవాయ” అనే మంత్రాన్ని వల్లెవేస్తూ గంగానది తీరంలో నడుస్తున్నాడు. చేతిలో జపమాల మెడలో రుద్రాక్ష హారం ధరించాడు. ఈ ”ఓం భగవతే వాసుదేవాయ” అనే మంత్రం చదవడం వలన ఆ తరంగాలు కలిపురుషుడుని తాకాయి. ఎక్కడి నుండి వస్తున్నది ”ఓం నమో భగవతే వాసుదేవాయ” అనే మంత్ర శబ్దం అని చుట్టూ పరికించాడు. గంగానది తీరంలో ఒక బక్కచిక్కిన ముదుసలి

 ”ఓం నమో భగవతే వాసుదేవాయ” అనే నామాన్ని జపించడం చూసి ఆ మంత్ర జపాన్ని ఆపాలని ఆ ముసలివాడి దగ్గరికి వెళ్లి పట్టుకోబోయాడు. అయన మీద చేయి వేసిన వెంటనే ఎగిరి  అర యోజన దూరంలో పడ్డాడు. కొంతసేపు ఏమి జరిగిందో తెలియక చూస్తే ఆ ముసలివాడు ముందు ఎక్కడో ”ఓం నమో భగవతే వాసుదేవాయ” అనే మంత్రాన్ని జపిస్తూ వెళ్తున్నాడు. ఎలాగైనా పట్టుకుని నామజపాన్ని ఆపాలని దగ్గరికి వెళ్ళాడు. పట్టుకోబోతే ఈసారి యోజనం దూరంలో పడ్డాడు. ఆ దెబ్బకి కలిపురుషుడు గజగజ ఒణికిపోయాడు. చూస్తే బక్కచిక్కి ఉన్నాడు. గట్టిగా గాలి వస్తే ఎగిరేలా ఉన్నాడు. కాని పట్టుకుందామంటే నేను ఎక్కడో పడుతున్నాను. ఒకవేళ నాశక్తి సన్నగిల్లిందా? కలియుగం ఆరంభంలో కృష్ణుడు వలన నా రాక ఆలస్యం అయింది. ఇదేమైన శ్రీకృష్ణుడి మాయా ప్రభావమా? అసలు ఇంతకీ ఆ ముసలివాడు ఎవ్వడు. శివుడా? విష్ణువా? అనుకుంటూ ఉండగా అటుగా వెళ్తున్న ”వేదవ్యాసుడు” కనిపించాడు. కలి వెంటనే వ్యాసుడు దగ్గరికి వెళ్లి మహానుభావ సమయానికి వచ్చావు. నా సందేహాన్ని నివృత్తి చేయండి. అన్నాడు. వ్యాసుడు నవ్వి. ఇది నీరాజ్యం. ఈకలికాలం నీది. నీకు సందేహమా? ఏ ఇద్దరుని సక్రమంగా ఉండనివ్వవు. ఎవరైనా కలిసున్నారంటే కళ్ళలో నిప్పులు పోసుకుంటావు. ఇలాంటి నీకు నా అవసరం ఏముంది? ఇంతకి నువ్వు కుశలమే కదా! కుశలమే! నారాజ్యంలో నేను కాక నువ్వు పాలించవు. కదా! అదిగో ఆ దూరంగా వెళ్తున్నాడే ఆ ముసలివాడు ఎవరు? ఆయన్ని పట్టుకోబోతే నా బలం సరిపోవడం లేదు. ఇదసలు నా రాజ్యమేనా? లేక మీరందరూ కలిసి నన్ను మాయ చేస్తున్నారా? చెప్పండి అని వేడుకున్నాడు. వేదవ్యాసుడు నవ్వి, ఓహో అదా నీ సందేహం. అయన పరమ విష్ణు భక్తుడు. అయన జపించే నామం వలన విష్ణు శక్తి ఉత్పన్నమై నిన్ను దగ్గరికి రానివ్వదు. పట్టుకోవాలని ప్రయత్నించవా! విష్ణువు నిన్ను నాశనం చేసి కలియుగాన్నే లేకుండా చేస్తాడు. త్రికరణ శుద్దిగా నిత్యం ” ఓం నమో భగవతే వాసుదేవాయ” అనే నామాన్ని ఎవరు పఠిస్తూ ఉంటారో వారిని నువ్వు కనీసం తాకనుకూడా తాకలేవు. కనుక ”ఓం నమో భగవతే వాసుదేవాయ” 
ఈ మంత్రాన్ని ప్రజలు పట్టుకునే లోపే నువ్వు పట్టుకో. లేదంటే నీ రాజ్యంలో నువ్వు ఉండలేవు. అని చెప్పి వెళ్ళిపోయాడు. ఇంతటి మహత్తరమైన ఈ మంత్రాన్ని నిత్యం జపించండి. 
ఓం నమో భగవతే వాసుదేవాయ 
ఓం నమో భగవతే వాసుదేవాయ 
ఓం నమో భగవతే వాసుదేవాయ 
ఓం నమో భగవతే వాసుదేవాయ 
ఓం నమో భగవతే వాసుదేవాయ 
వేదసంస్కృతి
Shyamam (శ్యామమ్) - By Swami Sundara Chaitanyananda [Only Audio]

రామజోగి చిట్కాలు #lyrical_audio_video#swami_sundara_chaitanyananda

 

ఆ పని చేసేందుకు, తోడుగా నడిచేందుకు, మలుపులు

అందంగా త్రిప్పేందుకు, మల్లెల మాటలను తేనెల

పాటలుగా మలచి దారి బత్తెముగా ఈ పుస్తకాన్ని

అందిస్తున్నాం. ఒక మంచి మార్గగామిని తోడుగా

పంపుతున్నామని తృప్తి చెందుతున్నాం.

పాటలుగా పుస్తకంలో శబ్దంగా ఆడియోలో

శబ్దంగా, దృశ్యంగా వీడియోలో

మీ తోడు ఉండే ఈ మార్గగామి రామజోగి. మార్గంలో

మీకు ఉపకరించే ఎన్నో చిట్కాలు అతని వద్ద ఉన్నాయి.

అవే రామజోగి చిట్కాలు. అడిగితే అందుతాయి. అడుగు

ముందుకేస్తే అందాలు చిందుతాయి. ఆనందాలు విందు

చేస్తాయి. వెళ్ళిరండి. మేమూ వస్తాము. అనంతంలో మళ్ళీ

కలుస్తాము.

SUNDARACHAITANYAM@ysreddy

ఊరేగే మేఘమాల#swami_sundara_chaitanyananda

 (1) ఊరేగే మేఘమాల

ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో, ఏ నాడు దాచుకున్న భాగ్యమో ఈ జన్మలో బాల్యంలోనే భక్తి మొగ్గ తొడిగింది. పది పదిహేను సంవత్సరాల మధ్య వయస్సులో భగవంతుని చూడాలని తీవ్రంగా పరితపించే వాణ్ణి. ఆ బాధలో ఆకలి వేస్తున్నా ఒక్కో పూట అన్నం తినేవాణ్ణి కాదు. ఆరోగ్యం సరిగ లేదని సాకు చెప్పి, దుప్పట్లో తల దూర్చి రోదించే వాణ్ణి. ఆ దశలో భగవంతుడంటే ఏమిటో కూడా తెలియదు. భగవద్గీత తెలియదు. జ్ఞానము అసలే లేదు. భగవంతుని కొరకు వ్యధ చెందడమే తెలుసు.

మా ఊరి సమీపంలో నది ప్రవహిస్తూ ఉంటుంది. దూరమైనా, అక్కడికి వెళ్ళి కూర్చొనేవాణ్ణి. చల్లని నదీ జలాన్ని పానం చేసి, పచ్చని మామిడి చెట్లను చూస్తూ, దూరంగా గోచరించే గిరి శిఖరాలను వీక్షిస్తూ, ఏకాంతంలో కొన్ని గంటలు ఉండిపోయేవాణ్ణి.

కృష్ణుడి కోసం ఆకాశం వైపు చూస్తే మేఘాలు కనుపించేవి. కృష్ణుడు నీలమేఘ శ్యాముడని హరికథలో విన్నాను. ఈ మేఘాలకి కృష్ణుని జాడ తెలిసే ఉంటుంది అనిపించింది. అవి కృష్ణుణ్ణి చూస్తున్నాయి అని భావించాను. వాటిని చూస్తూ విలపించాను. నన్ను కృష్ణుణ్ణి చూడ నివ్వండి అని ప్రార్థించాను. ఓ మేఘమా! నువ్వు కొద్దిగా జరుగు, నేను కృష్ణుణ్ణి చూస్తాను అని ఏడ్చాను. మేఘం అలా తేలిపోతూ ఉంది. కాని, కృష్ణుణ్ణి తన వెనుకే పెట్టుకొని నాకు చూపకుండా తీసుకెళ్ళి పోతోందని

అనిపించింది. చాలా బిగ్గరగా రోదించాను. కృష్ణుణ్ణి చూపమని పెద్దగా ఏడ్చాను. అదొక పిచ్చి గానే ఇప్పుడు అనిపించవచ్చు. కాని, ఆ వయస్సులో అదొక అనుభూతి. ఇప్పటికీ ఆ అనుభూతి నాలో పచ్చగానే ఉంది. వెచ్చగానే ఉంది. ఆ నాటి సన్నివేశాన్ని నాలో

నేను స్మృతికి తెచ్చుకున్నప్పుడు ఈ పాట వ్రాశాను.




వాయుపుత్రుని వినయశీలములు - స్వామి సుందర చైతన్యానంద

  వాయుపుత్రుని వినయశీలములు - స్వామి సుందర చైతన్యానంద “హనుమా! నీకు నేను ఇచ్చిన వస్తువును  చూడగానే రామునికి ఆనవాలు బాగా తెలుస్తుంది. చూడామణ...