Sunday, May 17, 2026
Saturday, May 16, 2026
AMMA_BOOK అమ్మ ఉమ్మ నీటిలో ఊపిరి పొదిగిన .... అమృత భాండం అమ్మ .....
AMMA_BOOK
అమ్మ
ఉమ్మ నీటిలో ఊపిరి పొదిగిన ....
అమృత భాండం అమ్మ .....
జీవ భాషలో కావ్యం నెరపిన ....
అమర కోశం అమ్మ ....
ఏమిచ్చినా ఋణం తీరదు అమ్మది ....
ఋణం తీర్చలేని అమ్మకి ....... LINK:
https://drive.google.com/file/d/0B6ZJh2NcOojrZjhwUzkwUE1WcUE/view?usp=sharing
అమ్మ ..ప్రేమకు మారు పేరు... మమతల సెలయేరు...
ఆత్మీయతల పెన్నిధి...వాత్సల్యామృత సన్నిధి....
ఇంతకన్నా గొప్ప దైవం ఈ ధరాతలాన మనకు కనబడుతుందా...
ధరిత్రిలోనే అత్యంత తీయనైనది... ఎన్నిసార్లు లిఖించినా, ఎన్ని వేలాసార్లు పలికినా పులకింపుకు గురిచేసేది అమ్మే... ఆ అమ్మ మీద ఒక పుష్కరం క్రితం నేను రాసిన చిరుకవిత ముఖపుస్తక మిత్రుల కోసం...
Venkat Garikapati
" అమ్మ పాట " నీవు లేవురా నేను లేనురా అవనిలోన అమ్మ లేని మనిషి అసలు లేడురా....... కన్న తల్లి అనురాగం కడ దాకా చవి చూచెడి అదృష్టం అబ్బినతని భాగ్యమే భాగ్యమురా............నీవు లేవురా....1 ఇంద్రు డయినా చంద్రు డయినా ఇద్దరిలోఒకడైన ఏనాడో ఒకనాడు అమ్మ చేతి పిల్లలురా.... జో జో ...జోజో ..... అనురాగపు మొల్లలురా..................................నీవు లేవురా....2 ఏనాడో ఒకనాటికి తనువు పండు నాటికీ ఆ అమ్మేమనచేతుల పసిపాపగ నిలిచినపుడు ఆ తరుణమే మాతృ ఋణం తీర్చుకొనెడు శుభతరుణం... ..........................నీవు లేవురా
గుడిలో ఏముంది? ఏముంటుందో - గుడిలో అదే ఉంటుంది నాయనా! #-భండారు శ్రీనివాసరావు 98491 30595
గుడిలో ఏముంది? ఏముంటుందో-
గుడిలో అదే ఉంటుంది నాయనా!
బుడుగును 'బుడుగూ' అని పిలుస్తారు బాపూ రమణలు. 'బుడ్డూ' అంటాడు గోపాళం. 'హారి బుడుగు కన్నా' అంటుంది వాళ్ళమ్మ. 'బుడుగా ఏంటి అసహ్యంగా మడుగూ బుడుగూ, పేరు లేదా ఆయ్' అంటాడు
అగ్నిహెూత్రావధాన్లు. 'బుడుగు అసలు పేరు చాలా పొడుగు. అందుకే బుడుగూ అంటాం వాయ్' అంటాడు రమణగారి జోకుకి కాపీరైట్ తీసుకుంటూ గిరీశం. 'ఏంది గురూ ఈ పేర్ల గోల' అంటుంది
సీగానపెసూనాంబ. శాలీ ఒక్కడే. పేర్లు అనేకం. బుడుగన్నా, కన్నా అన్నా, ఏం గురూ అన్నా, ఏ పేరు పెట్టి పిలిచినా, అసలు ఏపేరు పెట్టకుండా అరేయ్ ఒరేయ్ అని పిలిచినా ఎంచక్కా పలుకుతాడు
బాపూరమణల బుడుగు. అలానే దేవుడు!
దేవుడికి కావాల్సింది నమ్మకం. దేవుడున్నాడనే నమ్మకం.
నిజం చెప్పాలంటే నమ్మకానికి మరో పేరే దేవుడు. అందుకే అం
టారు 'తొక్కితే రాయి, మొక్కితే సాయి'. దేవుడి పేరుపెట్టి మను
షులుఘోరాలు చేయకుండా కనిపెట్టి చూసుకుంటే మిగిలినవన్నీ
ఆ దేవుడే చూసుకుంటాడు. దేవుడు పేరు చెప్పి సొమ్ములు పోగె
'సుకుంటున్నారని నాస్తికులు ఆరోపిస్తుంటే, దేవుడు లేడని
చెబుతూ డబ్బులు దండుకుంటున్నారని వారి ప్రత్యర్ధులు అం
టుంటారు.
'దేవుడున్నాడా వుంటే చూపించు' అనే మాటలన్నీ
పనికిమాలిన పలుకులు. 'దేవుడే అన్నీ చూసుకుంటాడు' అని,
అన్నీ ఆయనకే ఒదిలి చాపచుట్టేయడం ఇంకా పనికిమాలిన పని.
దేవుడు లేడని ఆయన్ని నమ్మనివాళ్ళంటారు. ఉన్నాడని నమ్మేవా
ళ్ళంటారు. దేవుడ్ని నమ్మినా నమ్మకపోయినా నమ్మినట్టు నటించ
డం వల్ల కొన్ని ప్రయోజనాలు ఉన్నట్టే, దేవుడ్ని నమ్ముతున్నా
నమ్మనట్టు బూకరించడం వల్ల కూడా కొన్ని లాభాలు ఉన్నాయి.
ఈ రెండు తరగతులవారు నిత్యం అందరికీ తారసపడుతూనే
ఉంటారు కాబట్టి వీరు కనబడడం కోసం ప్రత్యేకంగా తపస్సులు
చేయనక్కరలేదు. ఏదో ఒక అంశంపై టీవీ తెరలపై అనునిత్యం
దర్శనం ఇస్తూనే వుంటారు. వీరు కాక మరో రెండు తరగతుల
వారు ఉన్నారు. దేవుడే సాక్షాత్తు దిగివచ్చినా దేవుడ్ని నమ్మని
వారు ఒక బాపతు. కానీ ఆ విషయం పైకి టముకు వేసుకోరు.
మనసా వాచా కర్మణా పూర్తిగా దేవుడిని నమ్మేవారు రెండో రకం.
వీరుకూడా తాము నమ్మే భగవంతుడిని బజారుకు లాగరు. గుం
డెల్లోనే గుడి కట్టుకుని ఉంచుకుంటారు. టీవీ ఛానళ్ల వారికి కూడా
వీరి అయిపూ ఆజా పట్టదు. ఎందుకంటే వారి రేటింగులకు కావా
ల్సినట్టు దేవుడు గురించి ఎద్దేవాగా మాట్లాడడం, దేవుడి కోసం
పోట్లాడడం వీరికి, వారికి బొత్తిగా తెలియదు కాబట్టి.
దేవుడున్నాడో లేదో కానీ దేవుడున్నాడా లేడా అన్న ప్రశ్న
మాత్రం అనాదినుంచి ఉంటున్నదే. ఆస్తికులు, నాస్తికుల మధ్య
దేవుడిని గురించిన చర్చ కూడా అనాదినుంచి సాగుతున్నదే. ఈ
ఎడతెగని చర్చకు దేవుడి మాదిరిగానే అంతం అంటూ లేదు. వ్యర్థ
వాదాలు మాని ఎవరి పని వారు చూసుకుంటే అందరి పని ఆ
దేవుడే చూసుకుంటాడు. ఆ మాటకూడా ఆయనే చెప్పాడు
గీతలో. 'మీ పని మీరు చేయండి, ఫలితాన్ని నాకు వదిలేయండి'
అని. నాకంటే గొప్పవాడు, శక్తిమంతుడు మరొకడు ఉన్నాడని
ఒప్పుకోవడానికి నామోషీ పడనక్కరలేదు. ఇతరులలోని గొప్పదనం గుర్తిం
నీమదిలో నిలిచేవారు, వారు నాస్తికులయినా సరే,
సర్వశక్తి కలిగిన ఓ అగోచర శక్తి ఒకటి ఉండేవుంటుందని అనుకుంటే పేచీ
లేదు. అలాగే దేవుళ్ళని నమ్మే వాళ్ళు కూడా. భగవంతుడు ఉన్నాడని
పూర్తిగా విశ్వసించేగజేంద్రుడే మొసలి నోట చిక్కి విలవిలలాడుతున్నప్పుడు, 'కలడు కలండనెడివాడు కలడో
లేడో?' అని అనుమానపడతాడు. పరీక్ష పెట్టికానీ మార్కులు వేసే అలవాటులేని ఆ దేవదేవుడు పందొమ్మిదో రీలు తరువాత కానీ ఏనుగు రక్షణకు రాడు.ఒక్కోసారి దేవుళ్ళను చూస్తే జాలి వేస్తుంది. వాళ్లు చెప్పినమాట వాళ్ల భక్తులు కూడా వినరు. బుద్ధుడు విగ్రహారాధన వద్దంటే శిష్యులు ఆమాట వింటేనా. బహుశా అంతంత పెద్ద విగ్రహాలు ప్రపంచంలో మరే దేవుడుకి లేవేమో. (బుద్ధుడు దేవుడా అంటే అది మరోచర్చ) 'నేను సర్వవ్యాపితుడిని. ఎందెందు వెదకి చూసిన అందందే
వుంటాన'ని ఎంత మొత్తుకున్నా వినేదెవరు? 'చెట్టులో, పుట్టలో
అంతటా నేనే' అన్నా చెవినపెట్టే దెవరు? చిన్నదో పెద్దదో ఓ
గుడికట్టి అక్కడే కట్టిపడేశారు. గుడిలో ఆయన్ని కొలువుంచినంతమాత్రాన ఆయన అక్కడే ఉండి పోడు. 'ఇక్కడ ఉండే పాండురంగడు అక్కడ ఉన్నాడు' అన్నట్టు దేవుడు మందిరంలో ఉంటాడు, నమ్మినవారి మనోమందిరంలోను ఉంటాడు. మరి ప్రత్యేకంగా ఆయనకు ఓ గుడి ఎం
దుకు అనే ప్రశ్న వస్తుంది తప్పదు.
దేవుడి మీద గురికుదరడం కోసం గుడి. ప్రశాంత, ఆధ్యాత్మిక
వాతావరణంలో దేవుడి మీద ఏకాగ్రత నిలుపుకోవడం కోసం.
ఆయన అక్కడ ఉన్నాడు అనుకుంటే ఎప్పుడో ఒకప్పుడు వెళ్లి ఓ
దండం పెట్టుకుంటాం. అసలు గుడి రహస్యం వేరే ఉంది అనేవారి
వాదన వేరు. మనిషికి కావాల్సింది ఆహారం. దానికి మిక్కిలి కొర
తగా ఉండే పరమ పాత రోజుల్లో పులిహారో, పాయసమో చేసి
గుడికి వచ్చిన జనాలకు ప్రసాదంగా పంచేవారు. కూటికీ, గుడ్డకూ
మొహం వాచిన ఆ రోజుల్లో అదే మహా ప్రసాదం. ఆ పాతకాలపు
రోజుల్లో పల్లెల్లోని వయోవృద్ధులకు, అభాగ్యులకు గుడి ప్రసా
దమే మహాభాగ్యం. ఈ రోజుల్లో ప్రభుత్వాలు అలాటి పేద వృద్ధు
లకు నెలకు ఇంత అని డబ్బు చెల్లించి తమ బాధ్యత దులుపుకుం
టున్నాయి. నా అనేవాళ్ళు ఎవ్వరూ లేని, వంటావార్పూ సొం
తంగా చేసుకోలేని ఆ అభాగ్యులకు పైకం చేతిలో పెడితే ఏం ప్రయో
జనం. వండి వార్చేవాళ్ళు లేని నిస్సహాయులకు గుడిలో ప్రసా
దంగా లభించే పులిహారో, దక్షోజనమో, దాన్ని మించింది
ఏముంటుంది. ఆ రోజుల్లో గుళ్ళు ఈ సామాజిక బాధ్యతను గొప్పగా పోషించాయి. మరి ఇప్పుడో! ఓ పక్క పేదలకు ఉచితంగా పంచాల్సిన ప్రసాదాలను అమ్ముకుంటూ, మరో పక్క వీ.ఐ.పీ.ల సేవలో
తరిస్తున్నాయి. ఈ రోజుల్లో చదువుకునే పిల్లలకు ప్రభుత్వాలు ఎంతో
డబ్బు ఖర్చు చేసి మధ్యాహ్న భోజన పథకాలు అమలు చేస్తున్నాయి. పూర్వపు రోజుల్లో ప్రభుత్వాలపై భారం లేకుండా దేవాలయాలే ఈ పని చూసుకునేవి. నిలవవుండే పులిహెూర, పోషకాలు
సమృద్ధిగా వుండే దధోజనం, పాయసం వీటికి మించిన మధ్యా
హ్న భోజనం ఏముంటుంది. అలాగే గుడి అనేది తెలియని విష
యాలు తెలుసుకోవడానికి అవకాశం ఇచ్చే బడి కూడా. ఊరి
జనం నలుగురూ అరమరికలు లేకుండా ఒకచోట కలుసుకోవడా
నికి గుడిని మించిన సామాజిక వేదిక వేరేమివుంటుంది. పంచాంగ శ్రవణం పేరుతో వానలు ఎలా పడతాయి, ఏపంటలు వేసుకుంటే గిరాకీ ఉంటుంది అనే వివరాలు తెలిసేవి. వాటినినమ్మొచ్చా అంటే మరి ఆ రోజుల్లో పంచాంగమే వారికి గూగులమ్మ. గుడి పూజారే చిన్నా చితకా రోగాలను నిదానం చేసేవైద్యుడు. వాళ్లకు వైద్యం ఏమి తెలుసు ఇది పూర్తిగా అనాగరికం అంటే మరి ఆ పల్లె జనం ఏం చేయాలి? ఎక్కడకు పోవాలి? చదువుకున్న డాక్టర్లు పల్లెటూళ్ళకు పోరు. ఊరిజనం పట్నాలకు
పోలేరు, అమ్మ పెట్టదు అడుక్కోనివ్వదు అనే నానుడి లాగా, గుడి
అంటే కేవలం ఆస్తికత్వానికి ప్రతిరూపం అనుకోకూడదు. వాటిని
సరిగా వాడుకోగలిగితే, ఎన్నో సామాజిక ప్రయోజనాలు సిద్ధి
స్తాయి. గుడిలో ఏముందీ అని వ్యంగ్యంగా పాటలు పాడుకునే
అవసరం ఉండదు. అయితే, ప్రతిదీ రాజకీయమయమయి పో
తున్న ఈ రోజుల్లో ఇది సాధ్యమా అంటే అనుమా నమే. ఇక్కడ
గుడి అంటే దేవాలయం మాత్రమే కాదు అది ఒక మసీదు కావచ్చు. ఒక చర్చి కావచ్చు, ఒక గురు ద్వారా కావచ్చు. మరో మతానికి చెందిన దైవ మందిరం కావచ్చు. అవి ఏవైనా, నెరవేర్చే సామాజిక బాధ్యత మాత్రం ఒక్కటే. కాబట్టి దేవుడ్ని గుడికి పరిమితం చేయవద్దు.
గుడిని పెత్తందార్లకు
-భండారు శ్రీనివాసరావు
98491 30595
ఆంధ్రప్రభ https://epaper.prabhanews.com/c/62175338
“ శ్రీకృష్ణుడు మురళిని ఎందుకు వదలడు “ # శ్రీ శ్రీ శ్రీ స్వామి విద్యాప్రకాశానంద గిరి
“ శ్రీకృష్ణుడు మురళిని ఎందుకు వదలడు “
శ్రీ శ్రీ శ్రీ స్వామి విద్యాప్రకాశానంద గిరి - “కథా ఫలే”
శ్రీ కృష్ణమూర్తి తన నిత్యజీవిత వ్యవహారమందు అనేక వస్తువులను ఉపయోగించుకొనుచున్నను, ఒకవస్తువును మాత్రము నిరంతరం తనవద్దనే ఉంచుకొనుచుండెను.
అదియే మురళి,దానిని శ్రీ కృష్ణుడు ఏకాలమందును వదలక అహర్నిశము తన చెంతనే పెట్టుకొనుచుండెను.
కొద్ది సేపు ఆహ్లాదకరముగ, శ్రోతలు తన్మయులగునట్లు ఆ మురళిని వాయించి, తదుపరి ఆ పిల్లనగ్రోవిని తన చెవి పైననో, బొడ్డునందో దోపుకొనుచుండెను.
అంతియేకాని ఆ మురళిని దూరముగ ఎన్నడును
ఉంచుటలేదు. ఈ పరిస్థితి రుక్మిణీదేవి గమనించి ఒకప్పుడు తనలో నిట్లు వితర్కించుకొనెను- ఈ పిల్లనగ్రోవి నిరంతరము శ్రీ కృష్ణునకు అతి సమీపముగ వర్తించుచున్నది. శ్రీ కృష్ణుడు దానిని వదులుటలేదు.దానిపుణ్యమేమియో!
సతతముశ్రీకృష్ణునిసాన్నిధ్యశ్రీనిఅనుభవించుసౌభాగ్యములభించుట సామాన్యమా?ఎన్ని జన్మముల తపఃఫలితమో అది. నేను కూడ శ్రీ కృష్ణునకు ఒకింత దూరముననేయున్నాను గాని అంత సమీపమున లేను, నాకంటె మురళి ఎంతో సన్నిహితత్వమును అనుభవించుచున్నది.
భగవంతుడు దానిని వదలుటలేదు. ఆహా! ఎంతటి అదృష్టము!అట్టి సద్గతి లభించుటకు ఏమి పుణ్యము చేయవలెనో?నిరంతర శ్రీ కృష్ణసాన్నిధ్యభాగ్యము కలుగుటకు ఎట్టివ్రతములనాచరింపవలయునో ఏ విధమైన తపము సల్పవలయునో! మురళి ఈజన్మములో ఈ ప్రకారముగ శ్రీకృష్ణునకు అతి సన్నిహితముగ రాగల్గుటకు పూర్వజన్మ పుణ్యమే కారణమై ఉండును.కాబట్టి ఆ పుణ్యమేదియో తెలుసుకొనినయెడల నేనుకూడ ఈ జన్మలో అట్టి పుణ్యమాచరించి భావికాలమున ఆ లోకైకప్రభువునకు ఇంకను సమీపముగ వర్తింపగల్గుదును'. ఈ ప్రకారము చింతనచేసి రుక్మిణీదేవిఆ మురళితో తద్విషయమును గురించి చర్చించుటకై సమయము కొఱకు వేచియుండెను.శ్రీ కృష్ణుడు ఆ మురళిని ఎపుడైన దూరముగ పెట్టియుంచినచో అపుడు దానితో ఏకాంతముగ మాట్లాడిఅన్నియు తెలిసికొనవచ్చునని తలంచుచుండెను.రుక్మిణి యొక్క ఆంతర్యమును గ్రహించి శ్రీ కృష్ణుడొకనాడు తాను నిదురబోవుచున్నట్లు నటించి ఆ
మురళిని దూరముగ విసరివైచెను.సమయము కొఱకు నిరీక్షించుచున్న రుక్మిణీదేవితక్షణమే దానిని తీసుకొని ఒకానొక ఏకాంతస్థలమునకరిగి, దానికి ప్రాణ ప్రతిష్ఠచేసి మాట్లాడు శక్తిని ప్రసాదించి దానితో నిట్లు సంభాషించెను.
"ఓ మురళీ! నీవు పూర్వజన్మలో ఏమిపుణ్యము చేసి
నావు? ఏయే వ్రతములను సలిపినావు? ఎట్టి దానధర్మాలను కావించినావు? ఏయే తీర్థములను సేవించినావు? ఏ దేవతలనారాధించినావు? ఈ జన్మలో నీవు జగత్ర్పభువైన శ్రీ కృష్ణుని దివ్యసాన్నిధ్య శ్రీని నిరంతరము అనుభవింపగల్గుట పూర్వజన్మలో నీవు చేసిన అలౌకిక పుణ్యము యొక్క ప్రభావమే యగును.
కాబట్టి ఓ మురళీ!ఆ పుణ్యకార్యములేవియో ఇపుడు
నాకు తెలియజేసినచో నేనును వానిని ఆచరించి నీవలెనే శ్రీ కృష్ణునకు అతి సమీపమున చేరగల్గుదును. సంతతము అతని సాన్నిధ్యభాగ్యమును అనుభవింపగల్లు
దును. కావున తొందరగా చెప్పుము. నీవు పూర్వజన్మములో ఏమిపుణ్యము చేసినావు?"
రుక్మిణీదేవి యొక్క యా పలుకులను విని మురళి-
"అమ్మా నాకేమీ తెలియదు.పుణ్యమును గురించి గాని, పాపమును గురించి గాని పరిజ్ఞానము నాకి సుమంతైనను లేదు. అసలు పూర్వజన్మలో నేనెవరనో కూడ నాకు తెలియదు. క్షమించు తల్లీ!" అని సమాధానము చెప్పగా, రుక్మిణీదేవి అందులకంగీకరింపలేదు.
ఏదియో మహత్తర పుణ్యమును అది ఆచరించియే
యుండునను నమ్మకము రుక్మిణీదేవికి కలదు.
అందుచే మరల ఆమె ఆ మురళిని ఆ విషయమై నొక్కి ఎందుకు వదలడునొక్కి ప్రశ్నింప,చివరకు ఆ మురళి- "అమ్మా! నా స్వరూపమెటువంటిటో ఒక్కసారి చూడుము! నా లోపల ఏమియున్నదో బాగుగ పరికింపుము. తదుపరి నీకే తెలియగలదు" అని సమాధానమిచ్చెను.
వెంటనే రుక్మిణీదేవి ఆ మురళిని పైకెత్తి లోన ఏమియున్నదో జాగ్రత్తగ పరీక్షించెను.కాని ఆ మురళి లోపల ఏమియులేదు. వట్టి ఆకాశము (Vacuum) మాత్రము గోచరించెను.
అపుడు రుక్మిణీదేవి మురళితో-
"అమ్మా! నీ లోపలచూచినాను.ఏమియు లేదు. కేవలము ఖాళీగనున్నది"అని పలుక అంతట మురళి "ఆ ప్రకారము నాలో ఖాళీగఉండుటయే నాయొక్క విశేషము.నాలో ఏవిధమైన సరుకును నేను పెట్టుకొనలేదు.
వస్తుజాలమునంతటిని పరిత్యజించి నాయంతరంగమును దృశ్యరహితముగ నొనర్చుకొంటిని.కనుకనే నేను శ్రీ కృష్ణునకు సన్నిహితుడనైతిని. నా వలెనే ఎవరైనను సరియే తమ యంతఃకరణమునందలి వాసనాజాలమును, దుస్సంస్కారములను, ప్రాపంచిక విషయసంకల్పములను తొలగించి వైచి, మనస్సును నిర్విషయముగగావించి నిస్సంకల్పస్థితిని బడయుదురో అట్టివారు భగవంతునకు అతిసమీపముగ వర్తింపగల్గుదురు. మనశ్శుద్దియే అంత:కరణము యొక్క నిర్మలత్వమే దైవప్రాప్తికి
హేతువు"- అని గంభీరముగ పలికెను.
మురళి యొక్క ఆ హేతువాద సమన్విత వచనము
లను విని రుక్మిణీదేవి పరమానందభరితయై తన
యంత:కరణమునుగూడ ఆట్లు సునిర్మలమొనర్చుటకును, నిస్సంకల్పముగ, చిదాకాశమయముగ గావించుటకును మనసున నిశ్చయించుకొనెను.
భగవత్రాప్తికి మనోనిర్మలత్వమే ఏకైక కారణమని
ఈ ఇతిహాసం ద్వారా స్పష్టమగుచుండుటవలన
ముముక్షువులు తమచిత్తశుద్ధికై తీవ్ర కృషి సల్పి ఈ జన్మమునందే దైవసాన్నిధ్యాన్ని అనుభవించుదురుగాక! .*********
-
SREE BHAGAVATAM ETV SERIAL TOTAL 241 EPISODES FREE DOWNLOAD LINK Sri Bhagavatam ETV Episodes -1 to 241 https://mega.nz/...
-
LORD SHIVA SONGS MY COLLECTION https://my.pcloud.com/publink/show? code=kZvotdZe0aFbupW6CuMi2OlPgPOrLUIyN4y నేను సేకరించిన lord shiva ...