Tuesday, May 12, 2026

వేదసంస్కృతి - ఓం నమో భగవతే వాసుదేవాయ

 

ఓం నమో భగవతే వాసుదేవాయ ! ఈ మంత్రం ఎందుకు జపించాలి.? ఇప్పటికి సరిగ్గా 1500 సంవత్సరాల క్రితం సంఘటన. ఒక ముసలివాడు ”ఓం నమో భగవతే వాసుదేవాయ” అనే మంత్రాన్ని వల్లెవేస్తూ గంగానది తీరంలో నడుస్తున్నాడు. చేతిలో జపమాల మెడలో రుద్రాక్ష హారం ధరించాడు. ఈ ”ఓం భగవతే వాసుదేవాయ” అనే మంత్రం చదవడం వలన ఆ తరంగాలు కలిపురుషుడుని తాకాయి. ఎక్కడి నుండి వస్తున్నది ”ఓం నమో భగవతే వాసుదేవాయ” అనే మంత్ర శబ్దం అని చుట్టూ పరికించాడు. గంగానది తీరంలో ఒక బక్కచిక్కిన ముదుసలి

 ”ఓం నమో భగవతే వాసుదేవాయ” అనే నామాన్ని జపించడం చూసి ఆ మంత్ర జపాన్ని ఆపాలని ఆ ముసలివాడి దగ్గరికి వెళ్లి పట్టుకోబోయాడు. అయన మీద చేయి వేసిన వెంటనే ఎగిరి  అర యోజన దూరంలో పడ్డాడు. కొంతసేపు ఏమి జరిగిందో తెలియక చూస్తే ఆ ముసలివాడు ముందు ఎక్కడో ”ఓం నమో భగవతే వాసుదేవాయ” అనే మంత్రాన్ని జపిస్తూ వెళ్తున్నాడు. ఎలాగైనా పట్టుకుని నామజపాన్ని ఆపాలని దగ్గరికి వెళ్ళాడు. పట్టుకోబోతే ఈసారి యోజనం దూరంలో పడ్డాడు. ఆ దెబ్బకి కలిపురుషుడు గజగజ ఒణికిపోయాడు. చూస్తే బక్కచిక్కి ఉన్నాడు. గట్టిగా గాలి వస్తే ఎగిరేలా ఉన్నాడు. కాని పట్టుకుందామంటే నేను ఎక్కడో పడుతున్నాను. ఒకవేళ నాశక్తి సన్నగిల్లిందా? కలియుగం ఆరంభంలో కృష్ణుడు వలన నా రాక ఆలస్యం అయింది. ఇదేమైన శ్రీకృష్ణుడి మాయా ప్రభావమా? అసలు ఇంతకీ ఆ ముసలివాడు ఎవ్వడు. శివుడా? విష్ణువా? అనుకుంటూ ఉండగా అటుగా వెళ్తున్న ”వేదవ్యాసుడు” కనిపించాడు. కలి వెంటనే వ్యాసుడు దగ్గరికి వెళ్లి మహానుభావ సమయానికి వచ్చావు. నా సందేహాన్ని నివృత్తి చేయండి. అన్నాడు. వ్యాసుడు నవ్వి. ఇది నీరాజ్యం. ఈకలికాలం నీది. నీకు సందేహమా? ఏ ఇద్దరుని సక్రమంగా ఉండనివ్వవు. ఎవరైనా కలిసున్నారంటే కళ్ళలో నిప్పులు పోసుకుంటావు. ఇలాంటి నీకు నా అవసరం ఏముంది? ఇంతకి నువ్వు కుశలమే కదా! కుశలమే! నారాజ్యంలో నేను కాక నువ్వు పాలించవు. కదా! అదిగో ఆ దూరంగా వెళ్తున్నాడే ఆ ముసలివాడు ఎవరు? ఆయన్ని పట్టుకోబోతే నా బలం సరిపోవడం లేదు. ఇదసలు నా రాజ్యమేనా? లేక మీరందరూ కలిసి నన్ను మాయ చేస్తున్నారా? చెప్పండి అని వేడుకున్నాడు. వేదవ్యాసుడు నవ్వి, ఓహో అదా నీ సందేహం. అయన పరమ విష్ణు భక్తుడు. అయన జపించే నామం వలన విష్ణు శక్తి ఉత్పన్నమై నిన్ను దగ్గరికి రానివ్వదు. పట్టుకోవాలని ప్రయత్నించవా! విష్ణువు నిన్ను నాశనం చేసి కలియుగాన్నే లేకుండా చేస్తాడు. త్రికరణ శుద్దిగా నిత్యం ” ఓం నమో భగవతే వాసుదేవాయ” అనే నామాన్ని ఎవరు పఠిస్తూ ఉంటారో వారిని నువ్వు కనీసం తాకనుకూడా తాకలేవు. కనుక ”ఓం నమో భగవతే వాసుదేవాయ” 
ఈ మంత్రాన్ని ప్రజలు పట్టుకునే లోపే నువ్వు పట్టుకో. లేదంటే నీ రాజ్యంలో నువ్వు ఉండలేవు. అని చెప్పి వెళ్ళిపోయాడు. ఇంతటి మహత్తరమైన ఈ మంత్రాన్ని నిత్యం జపించండి. 
ఓం నమో భగవతే వాసుదేవాయ 
ఓం నమో భగవతే వాసుదేవాయ 
ఓం నమో భగవతే వాసుదేవాయ 
ఓం నమో భగవతే వాసుదేవాయ 
ఓం నమో భగవతే వాసుదేవాయ 
వేదసంస్కృతి
Shyamam (శ్యామమ్) - By Swami Sundara Chaitanyananda [Only Audio]

రామజోగి చిట్కాలు #lyrical_audio_video#swami_sundara_chaitanyananda

 

ఆ పని చేసేందుకు, తోడుగా నడిచేందుకు, మలుపులు

అందంగా త్రిప్పేందుకు, మల్లెల మాటలను తేనెల

పాటలుగా మలచి దారి బత్తెముగా ఈ పుస్తకాన్ని

అందిస్తున్నాం. ఒక మంచి మార్గగామిని తోడుగా

పంపుతున్నామని తృప్తి చెందుతున్నాం.

పాటలుగా పుస్తకంలో శబ్దంగా ఆడియోలో

శబ్దంగా, దృశ్యంగా వీడియోలో

మీ తోడు ఉండే ఈ మార్గగామి రామజోగి. మార్గంలో

మీకు ఉపకరించే ఎన్నో చిట్కాలు అతని వద్ద ఉన్నాయి.

అవే రామజోగి చిట్కాలు. అడిగితే అందుతాయి. అడుగు

ముందుకేస్తే అందాలు చిందుతాయి. ఆనందాలు విందు

చేస్తాయి. వెళ్ళిరండి. మేమూ వస్తాము. అనంతంలో మళ్ళీ

కలుస్తాము.

SUNDARACHAITANYAM@ysreddy

ఊరేగే మేఘమాల#swami_sundara_chaitanyananda

 (1) ఊరేగే మేఘమాల

ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో, ఏ నాడు దాచుకున్న భాగ్యమో ఈ జన్మలో బాల్యంలోనే భక్తి మొగ్గ తొడిగింది. పది పదిహేను సంవత్సరాల మధ్య వయస్సులో భగవంతుని చూడాలని తీవ్రంగా పరితపించే వాణ్ణి. ఆ బాధలో ఆకలి వేస్తున్నా ఒక్కో పూట అన్నం తినేవాణ్ణి కాదు. ఆరోగ్యం సరిగ లేదని సాకు చెప్పి, దుప్పట్లో తల దూర్చి రోదించే వాణ్ణి. ఆ దశలో భగవంతుడంటే ఏమిటో కూడా తెలియదు. భగవద్గీత తెలియదు. జ్ఞానము అసలే లేదు. భగవంతుని కొరకు వ్యధ చెందడమే తెలుసు.

మా ఊరి సమీపంలో నది ప్రవహిస్తూ ఉంటుంది. దూరమైనా, అక్కడికి వెళ్ళి కూర్చొనేవాణ్ణి. చల్లని నదీ జలాన్ని పానం చేసి, పచ్చని మామిడి చెట్లను చూస్తూ, దూరంగా గోచరించే గిరి శిఖరాలను వీక్షిస్తూ, ఏకాంతంలో కొన్ని గంటలు ఉండిపోయేవాణ్ణి.

కృష్ణుడి కోసం ఆకాశం వైపు చూస్తే మేఘాలు కనుపించేవి. కృష్ణుడు నీలమేఘ శ్యాముడని హరికథలో విన్నాను. ఈ మేఘాలకి కృష్ణుని జాడ తెలిసే ఉంటుంది అనిపించింది. అవి కృష్ణుణ్ణి చూస్తున్నాయి అని భావించాను. వాటిని చూస్తూ విలపించాను. నన్ను కృష్ణుణ్ణి చూడ నివ్వండి అని ప్రార్థించాను. ఓ మేఘమా! నువ్వు కొద్దిగా జరుగు, నేను కృష్ణుణ్ణి చూస్తాను అని ఏడ్చాను. మేఘం అలా తేలిపోతూ ఉంది. కాని, కృష్ణుణ్ణి తన వెనుకే పెట్టుకొని నాకు చూపకుండా తీసుకెళ్ళి పోతోందని

అనిపించింది. చాలా బిగ్గరగా రోదించాను. కృష్ణుణ్ణి చూపమని పెద్దగా ఏడ్చాను. అదొక పిచ్చి గానే ఇప్పుడు అనిపించవచ్చు. కాని, ఆ వయస్సులో అదొక అనుభూతి. ఇప్పటికీ ఆ అనుభూతి నాలో పచ్చగానే ఉంది. వెచ్చగానే ఉంది. ఆ నాటి సన్నివేశాన్ని నాలో

నేను స్మృతికి తెచ్చుకున్నప్పుడు ఈ పాట వ్రాశాను.




అనాథల.. ఆశాజ్యోతి……యశోద చారిటబుల్ ఫౌండేషన్

 

అనాథల.. ఆశాజ్యోతి……యశోద చారిటబుల్ ఫౌండేషన్

*అనాథ యువతకు వెలుగు దారి చూపుతున్న వేదిక

*ఒంటరి జీవితాల్లో విశ్వాసం నింపుతున్న యశోద గ్రూప్ సీఎండీ

*వృత్తి విద్యలో శిక్షణనిస్తూ ఆదర్శంగా నిలుస్తున్న రవీందర్ రావు

కష్టసుఖాలు తెలిసిన వారే.. ఇతరుల కష్టాలను అర్థం చేసుకుంటారనేందుకు యశోద గ్రూప్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ జి.రవీందర్ రావే నిదర్శనం. 'సొంత లాభం కొంత మాని... పొరుగు వారికి తోడ్పడవోయ్' అన్న గురజాడ సూక్తిని అక్షరాలా

ఆచరిస్తున్న వ్యక్తి ఆయన. యశోద చారిటబుల్ ఫౌండేషన్ స్థాపించి అనాథ యువతకు వృత్తి శిక్షణ అందిస్తున్నారు. మానవ సేవే మాధవ సేవగా భావించి యువతను ఉన్నత శిఖరాల వైపు నడిపిస్తున్న రవీందర్ రావు కృషి ఎందరెందరికో

స్ఫూర్తిదాయకం. అనాథ యువతలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతున్న యశోద చారిటబుల్ ఫౌండేషన్ విశేషాలు మీకోసం... 

*జీవితంలో లక్ష్యం సాధించాలన్న దృఢ సంకల్పం అవసరం. తల్లిదండ్రులు, కుటుంబానికి దూరంగా బతికే మనో ప్రపంచం అత్యంత భయానకంగా ఉంటుంది. జీవితం ఆగమ్యగోచరంగా కనిపిస్తుంది. చుట్టూ ఉన్న సమాజంపై కొన్నిసార్లు కోసం వస్తుంది. ఒంటరితనంలోంచి వివేచన కోల్పోయే స్థితికి చేరుకుంటారు. అలాంటి వారిలో ఆత్మవిశ్వాసం  నింపితే.. సరైన మార్గనిర్దేశం చేస్తే.. ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు. అలాంటి కర్తవ్యాన్ని భుజానికెత్తుకుంది యశోద, చారిటబుల్ ఫౌండేషన్, ఆనాధ పిల్లలకు ఉపాధి కల్పించి.. వాళ్లు జీవితంలో స్థిరపడేలా ప్రోత్సహించే ఉద్దేశంతో రవీందర్ రావు 2011లో ఈ ఫౌండేషన్ను స్థాపించారు. ఇప్పటి వరకు వేలాది మందికి శిక్షణ ఇచ్చి, ఉపాధి

అవకాశం కల్పించిన ఈ ఫౌండేషన్ సేవలను ప్రతి ఒక్కరూ కొనియాడుతున్నారు.

ఆర్థిక స్వావలంబన ....

ఇక్కడ శిక్షణ పొందిన వారు ఎలాంటి క్లిష్టపరిస్థితుల్లోనైనా ఇతరులపై ఆధారపడకుండా ఆర్ధిక స్వావలంబన సాధిస్తున్నారు. అంతేకాదు.. జీవన గమనంలో ఎదురయ్యే సమస్యలను అధిగమింరేందుకు కు అవసరమైన కౌన్సెలింగ్ అందిస్తోందీ సంస్థ. ఇప్పటి వరకు 2108 మంది విద్యార్థులు ఈ ఫౌండేషన్లో శిక్షణ పొందగా, 1882 మంది ఉద్యోగాలు పొందారు. ప్రస్తుతం 146 మంది శిక్షణ పొందుతున్నారు. విద్యార్థులకు ఇంగ్లీషు ను బోధిస్తూ వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తోంది. అలాగే, కంప్యూటర్ పరిజ్ఞానం అందిస్తోందీ సంస్థ

ఆత్మవిశ్వాసం నింపుతాం 

అనాథ పిల్లల్లో ఆత్మవిశ్వాసం నింపి, స్వావలంబన దిశగా వారిని నడిపించేందుకే ఈ సంస్థను ప్రారంభించాం. పదో తరగతి పూర్తి చేసిన 16 నుంచి 20 ఏళ్ల మధ్య వయసు ఉన్న అనాధ యువతకు 65 రోజులపాటు ఉపాధి అనుబంధ శిక్షణ ఇవ్వడంతోపాటు ఉచిత భోజనం, వసతి, ఉపకార వేతనాలు కూడా అందిస్తున్నాం. శిక్షణ పొందిన వారికి ఆస్పత్రులు, బీపీఓ, ఎంయెన్సీ కంపెనీల్లో ఒప్పందాలు కుదుర్చుకుని ఉపాధి కల్పిస్తున్నాం. ఒక్కొక్కరిదీ ఒక్కో నేపథ్యం.. కుల, మత, ప్రాంత బేధాలు లేకుండా ఇక్కడ శిక్షణ పొందుతున్నారు. నైరాశ్యంలో ఉన్న అనాధలను ఆత్మ విశ్వాసంతో తమ కాళ్లపై తాము నిలబడగలిగేలా తీర్చిదిద్దుతున్నాం. సమస్యలను అధిగమించేందుకు అవసరమైన సామకూల దృక్పధాన్ని అందించేందుకు కౌన్సెలింగ్ ఇప్పిస్తున్నట్లు 'యశోద' గ్రూప్సీఎండీ రవీందర్ రావు వివరించారు.

ట్యూటర్ల నియామకం

అనాధశ్రయాల్లో ఉంటూ పాఠశాల విద్యనభ్యసిస్తున్న విద్యార్థుల్లో మెరుగైన ప్రతిభను వెలికితీసేందుకు ప్రత్యేకంగా ట్యూటర్లను నియమిస్తున్నారు. 8,9,10వ తరగతి విద్యార్థులు గణితం, సైన్స్, ఇంగ్లిష్ వంటి క్లిష్టమైన సబ్జెక్టుల్లో మంచి నైపుణ్యం పొందడానికి ట్యూటర్లు దోహదపడుతున్నారు.

10వ తరగతి పూర్తి చేసిన విద్యార్థులు వృత్తి విద్యా కోర్సు అభ్యసించేందుకు ఫౌండేషన్ సహకరిస్తోంది. డీఎంఎల్, ఎంపీహెచ్ డబ్ల్యూ, ఈసీజీ టెక్నీషియన్స్, సీఎస్ఏతోపాటు ఎలక్ట్రిషన్, ప్లంబింగ్, డ్రైవింగ్, కార్పెంటర్ వృత్తుల్లో ఆసక్తిని బట్టి శిక్షణ అందిస్తున్నామని సంస్థ ఛైర్మన్ రవీందర్ రావు తెలిపారు ఎవరైనా వివరాలు కావాలనుకుంటే  https://yashodafoundation.org/  లో సంప్రదించాలన్నారు.

ధైర్యం వచ్చింది; మాది అంబర్పేట్, ఇంటర్మీడియెట్ పూర్తి చేశాను. ఇక్కడికి వచ్చాక ఎవరిపై ఆధారపడకుండా నా కాళ్లపై నేను నిలబడగలనన్న ధైర్యాన్ని కూడగట్టుకోగలిగాను. జీవితంలో ఎదగడానికి ఈ శిక్షణ ఎంతో ఉపయోగపడుతోంది. ఇక్కడ సమాజంలో ఎవరితో ఎలా మెలగాలో నేర్పించారు. మంచి ఉద్యోగం సాధిస్తానన్న నమ్మకం కలిగింది. - పి.మాధురి

బాధలన్నీ మర్చిపోయా; మాది వైజాగ్ చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోవడంతో మా అత్తయ్యవాళ్ల వద్ద పెరిగాను, అమన్ వేదిక సంస్ధ ద్వారా నేను ఈ ఫౌండేషన్లో చేరాను చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు అనుభవించాను. ఇక్కడికి వచ్చాక అవన్నీ మర్చిపోయాను. మంచి ఉద్యోగం సంపాదించగలన్న ఆత్మవిశ్వాసం వచ్చింది భవిష్యత్లో మంచి ఉద్యోగం సాధించి అనాథలకు సేవ చేస్తా.- పి.సుశాంతి

ఆత్మవిశ్వాసం పెరిగింది; మాది న్యూ బోయిగూడ, చిన్నప్పుడే మా నాన్న చనిపోయారు. మా.

అమ్మ ఎంతో కష్టపడి నన్ను పెంచింది మా అమ్మ ఇళ్లలో పని చేస్తేనే పూట గడుస్తోంది. అందుకే అమ్మకు సహాయంగా ఉదయం, సాయంత్రం వేళల్లో నేను కూడా పని చేసేదాన్ని. ఇక్కడికి వచ్చాక నాకు ఆత్మవిశ్వాసం పెరిగింది. షాదాన్ కళాశాలలో బీఎస్సీ (నర్సింగ్)లో సీట్ వచ్చింది. కోర్సు పూర్తయ్యాక మంచి ఉద్యోగం సాధిస్తానన్న విశ్వాసం.

వచ్చింది. -జహంగీర్ బీ 

నేనూ ఫౌండేషన్ స్థాపిస్తా; మాది శ్రీకాకుళం నాకు అమ్మానాన్న లేరు యశోద చారిటబుల్ ఫౌండేషన్లో శిక్షణ పొందాక నాకు మంచి నమ్మకం కలిగింది నేను కూడా భవిష్యత్తులో ఇలాంటి ఫౌండేషన్ ను స్థాపించి నాలాంటి ఆనాధలకు సహాయం చేస్తా. - శ్రీను

మార్పు వచ్చింది; అమ్మానాన్న చనిపోయాక పిన్ని దగ్గర పెరిగాను. పట్నంలో ఏదో పనిచేసుకొని బతకాలని పశ్చిమ గోదావరి జిల్లా నుంచి వచ్చాను. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో భగవంత్ అన్నయ్య కలిశారు తను నన్ను బీసీ హాస్టల్లో చేర్పించారు అక్కడి నుంచి ఫౌండేషన్కి వచ్చాను. ప్రస్తుతం వృత్తి విద్యా కోర్సులో శిక్షణ పొందుతున్నా. గతంలోలా ఇప్పుడు నాలో సంశయాలు లేవు. ప్రతి విషయంపై పాజిటివ్ గా ఆలోచిస్తున్నా.-ఎ.అఖిల్ చంద్ర

ఉచిత శిక్షణ అంటే నమ్మలేదు.; మాది దిల్ సుఖ్ నగర్ నాన్న చనిపోయాక అమ్మ కష్టపడి పెంచింది. ఇక్కడ ఉచితంగా భోజనం, వసతి కల్పించి శిక్షణ ఇచ్చి, ఉద్యోగం ఇప్పిస్తారంటే మొదట్లో నమ్మలేదు కానీ ఇక్కడికి వచ్చాక ఏన్నో కొత్త 

విషయాలు తెలుసుకున్నాను ఏదైనా సాధించగలమన్న విశ్వాసం పెరిగింది మంచి ఉద్యోగం సాధించి నాలాంటి వారికి సహాయం అందిస్తాను. -ఎం.మాధవి

సంప్రదించండి: yashodafoundation.org ఫోన్ : 040-47766675 ; 9963404620


GIRIDHARI_MAY_2026#SWAMI_SUNDARA_CHAITANYANANDA#ASHRAMAM_PHOTOS













 

Monday, May 11, 2026

చైతన్య గీతికలు - నవ్విన పువ్వులు#swami sundara chaitanyananda

 చైతన్య గీతికలు - నవ్విన పువ్వులు

-స్వామి సుందర చైతన్యానంద

మధురమైన భావాలను

సుమధురమైన పదజాలంలో తురిమి

మృదుమధురమైన కవితా పల్లకీలో కూర్చోబెట్టి

ఊరేగించేదే కవిత్వమైతే,

దానికి ముందు మాట రాసేందుకు

కవిగా నేను ముందుకు రాలేను.

మీ ముందుకు రాలేను.

కవిత్వ మనేది కేవలం సమదర్శనమే నని

కవి ఏనాడైనా క్రాంతదర్శియే నని

నిజాలను ప్రదర్శించే యత్నంలో

ఋజువులను సృష్టించే ప్రయత్నంలో

యోజనాలను దూరాలుగా, భారాలుగా భావించక

ప్రయోజనాలనే భవ్యంగా, భావ్యంగా తలచి

జననాడిని కుదిపి

జీవనాడిని తెలిసి

జీవన స్రవంతి నిరాటంకంగా సాగేందుకు

అవరోధాలను తొలగించి

రేపటి ఆశకు తెరదించి

నిన్నటి నిరాశకు సమాధి కట్టి

నేటిని మేటిగా నిలిపేందుకు

సర్వాన్ని సర్వంలో కలిపేందుకు - 

కవిత్వమొక సాధనమైతే,

కవిగా నేను సాధకుణ్ణి.

సాధ్యాన్ని కూడా.

అవలోకించే వారికి సుందర వనాన్ని

అండ చేరే వారికి చైతన్య నిలయాన్ని

ఆస్వాదించే వారికి ఆనందాలయాన్ని.

ఈ వనంలో

విరబూసిన వేదాంత సుమాలే చైతన్య స్వరాలు

ఈ నిలయంలో

విరజిమ్మిన విజ్ఞాన సౌరభాలే చైతన్య రాగాలు

ఈ ఆలయంలో

విరివిగ వితరణ చేయబడిన ప్రసాదాలే 

చైతన్య గానాలు.ఈ పాటల్లో,

మంచి చెడుల మర్మాలున్నాయి.

ధర్మాధర్మాల సందడు లున్నాయి.

వివేకాన్ని పంచే అంగడు లున్నాయి.

పూజించేందుకు గుడు లెన్నో ఉన్నాయి.

వెల కట్టేందుకు యతిప్రాస లున్నాయి.

వెల కట్ట లేని యతి శ్వాస లున్నాయి.

మాసిపోని మాట లున్నాయి.

హద్దులు దాటిన పదా లున్నాయి.

తెల్లని కాగితాలపై తేలియాడే ఈ నల్లని రాతలు

కాలం చెల్లే రాతలు కావు. కాలంలో 

చెల్లని రాతలూ కావు.

ఇవి జ్ఞానక్షీరాన్ని అందించే మాతలు

తప్పకుండా తుడుస్తాయి మన తల రాతలు.

ఇందులో,

కవిలేడు. కవిత్వ ముంది.

గాయకుడు లేడు. గాన ముంది.

వేదాంతి లేడు. వేదాంత ముంది.

కర్త లేకుండా సాగిన కర్మ ఇది. యజ్ఞమిది. 

జ్ఞానయజ్ఞ మిది.

వసంతాన్ని చూచేందుకు కళ్ళు సరిపోతాయి.

అనుభవించేందుకు హృదయ ముండాలి.

సున్నితమైన ఒక హృదయం ఒలికించిన

కవితా సుధలను పట్టి నిలుపుకొనేందుకు

సరియైన పాత్ర మరొక సున్నిత హృదయమే.

హృదయేశుని రస మందిరమే.

సరసమయ నవరస మందిరమే.

సమరస మందిరమే.

స్వామి

కలలను కరిగించే

కవితా ఉషస్సులో

ప్రార్థనే ప్రాణవాయువుగా పొందిన

ఓ కిరణం

స్వామి సుందరచైతన్యానంద

కలగ కృష్ణమోహన్ ..లలిత సంగీత చక్రవర్తి కృష్ణమోహన్...TELUGU WIKIPEDIA LINK..my music friend@ vijayanagar colony

 నా సంగీత మిత్రులు @ విజయ నగర్ కాలనీ in 1990 period...

కలగ కృష్ణమోహన్ఈ పేరు సంగీత రసజ్ఞులకు చిరపరిచయమే. రేడియో శ్రోతలకు ఇంకా ఎక్కువగా పరిచయం. ఐదు దశాబ్దాలుగా లలిత, భావ గీతాలకు అద్భుతంగా స్వరాలు అల్లి, లలిత గీతాలు రాసి, వాటిని ఆలపించి, సంగీత నిర్వహణ చేస్తూ సంగీత సరస్వతికి సేవచేస్తున్న సంగీత జ్ఞాని కృష్ణమోహన్. ఆల్ ఇండియా రేడియో, హైదరాబాదు కేంద్రంలో సంగీత శాఖకు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేసి ఇటీవలే ఉద్యోగ విరమణ చేశారు. సంగీత రచనతో

లలిత సంగీత చక్రవర్తి కృష్ణమోహన్

“లాలిత్యమే ప్రాణంగా, సరళత్వమే మార్గంగా, రసభావాలు ఆధారంగా, పండిత,

పామరజనాన్ని రంజింపజేసేదిగా విలసిల్లే కవితా సుధా ఝరుల సుందర సాహిత్యమే

లలిత గీతం”

I POSTED KALAGA KRISHNA MOHAN DATA IN TELUGU WIKI PEDIA

VIEW LINK: https://w.wiki/N8TE

https://docs.google.com/document/d/1GYcJTpOCY-ELc2Gh_I5ArUVWY57EkZn8J39oeuT4Cuc/edit?usp=sharing

వేదసంస్కృతి - ఓం నమో భగవతే వాసుదేవాయ

  వేదసంస్కృతి - ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ! ఈ మంత్రం ఎందుకు జపించాలి.? ఇప్పటికి సరిగ్గా 1500 సంవత్సరాల క్రితం సంఘటన. ఒక ...