telugudevotionalswaranjali.blogspot.com
Monday, April 21, 2025
Saturday, April 19, 2025
Friday, April 18, 2025
ఆ ఎరుకే ఆధ్యాత్మికత!…జిడ్డు కృష్ణమూర్తి#linkindescription#must
Tuesday, April 15, 2025
ANNAMACHARYA KIRTANALU_G.BALAKRISHNA PRASAD VIDEO LINKS@DAILYMOTION CHANNEL
ANNAMACHARY KIRTANALU_G.BALAKRISHNA PRASAD_DISK-8
ANNAMACHARYA KIRTANALU_G.BALAKRISHNA PRASAD_DISK-4
ANNAMACHAYA KIRTANALU__G.BALAKRISHNAPRASAD-DISK-6
ANNAMACHARYA KEERTANALU_G.BALAKRISHNA PRASAD_disk-7
ANNAMACHAYA KIRTANALU__G.BALAKRISHNAPRASAD-DISK-5
ANNAMACHARYA KEERTANALU_G.BALAKRISHNAPRASAD-disk3
ANNAMACHARYA KEERTANALU_G.BALAKRISHNA PRASAD_DISK-1
ANNAMACHARYA KEERTANALU_G.BALAKRISHNAPRASAD-disk2
SRI VENKATARAMANA GOVINDA_G.BALAKRISHNAPRASAD
alara chanchalamyna_GBKP
yeduTa nunnADu veeDubAluDu
yedayanemi hari ecchina janmame- G. Balakrishna prasad
muddulumomuna_g.balakrishna prasad
satulala_GBKP
sapta girulu datali_GBKP
MUNULA TAPAMULA_GBKP
padiharu vannela_GBKP
mudugare_GBKP
meluko_GBKP
kondalu dati vachinamayya_GBKP
Kalashapuramu kada_GBKP
DAYAGANAVAYYA_gbkp
Ideshirasu manikya_gbkp
ANI ANATICHE_GBKP
Monday, April 14, 2025
Sunday, April 13, 2025
జీవిత పరమార్థం #PURPOSE OF LIFE
20. భగవద్ధ్యానమే ధ్యేయం
ShilaNeeveShilpiNeeveShilpamNeevefullSong#Jayaraj#MohanBallepalli#BommakuMurali#Vijayyesudasu#song
TO DOWNLOAD THIS SONG CLICK THIS LINK: https://archive.org/download/shila-neeve-shilipi-neeve-shilpam-neeve-full-song-jayaraj-mohan-ballepalli/SHILA%20NEEVE%20SHILIPI%20NEEVE%20SHILPAM%20NEEVE%20full%20SONG%20-JAYARAJ-%20MOHAN%20BALLEPALLI.mp4
ఈ పాట విని నా జన్మధన్యమైంది ఈ పాట కు ఎన్ని అవార్డులు ఇచ్చిన తక్కువనే. ఇలాంటి పాటలు ఇంక ఎన్నో పాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నీ అభిమాని 🙏🙏🙏🙏🙏🙏🙏🙏 జయ రాజు గారికి మరియు విజయ్ జేసుదాస్ గారికి ఈ పాట వింటుంటే మనసు కట్టడి చేసింది భావితరాలకు మంచి సందేశాత్మకంగా వివరణ కల్పించిన అందరికీ అభినందనలు ఈరోజు .ఈపాటవిన్నందుకు.చాలాసంతోషంగాఉంది.ఈపాటవ్రాసినవారికి.పాడినవారికి.ఇందులోభాగమైనవారందరికీ.వందనాలు.విన్నంతసేపుఎంతోఅహ్లాదకరంగాఅనిపించింది.దన్యవాదములు.🙏🙏🙏🙏 మాటలురాని ఒక అద్భుత గానం రచయితకు ,గాయకునికి ,ఎన్ని వందనాలు చేసినా చాలదు .ఇంత అద్భుతమైన పాటను ఈ మధ్యలో వినలేదు . ధన్యవాదములు టీమ్ అందరికి 🙏🌷🙇♀️🌷🙏👌👍🇮🇳👍 జయరాజన్న .....మీ పాట ఒక అద్భుత కళా ఖండం .కాల గమనంలో మనిషి జీవన గమనాన్ని అమోఘంగా చిత్రించారు ....💐💐💐🙏🏻🙏🏻🙏🏻 జయరాజన్న మీ కలానికి మీ కల్పన కు మీ రచనకు శతకోటివందనలు🙏🙏🙏♥️💐. ఒక్క పాటలో మధురరాతి మధురంగా జీవిత మంతా ప్రకృతి తో గల అనుబంధం ఆత్మీయతానంతా వినిపించారు 💐💐💐🙏🙏 పాట సాహిత్యానికి, అర్థవంతముగ పాడినవారికి, గాత్రానికి లోపడిన సంగీతానికి, వినులవిందు చేసిన అందరికి వంద. Excellent song. ఇది ఒక అద్భుతమైన పాట. పాఠశాలల బోధనాంశాలలో తప్పకుండా చేర్చాల్సినంత గొప్ప స్పూర్తిదాయకం, నీతి నిండి ఉన్నాయి. వేయి వందనాలు. 👏👏👏👏👏👏👌👌👌👌👌👌👌👌 3 weeks ago ఎంత సేపు విన్నా గానీ మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది ఎంత విన్నా తనివి తీరడం లేదు ఇంత గొప్ప గానామృతం హ్యాట్సాఫ్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 అద్భుతమైన పాట ఈ పాటకు శత కోటి వందనాలు ఇలాంటి గొప్ప పాట విని మనుషుల్లో మార్పు రావాలి 🙏🙏🙏 సమాజమును మేల్కొలిపే విధముగా గీతాన్నీ ర చించిన శ్రీ జయరాజ్ గారికి మరియు మధురముగ గీతాలాపన చేసిన విజయ్ యేసుదాస్ గారికి ధన్యవాదములు శిల శిల్పం శిల్పి …. ఎంతలోతైన మాట! జయరాజ్ గారి మాటలను అద్భుతంగా పాటగా మలచి వినిపించిన విజయ్ గారికి 🙏🙏 ప్రకృతిని మానవతను శ్రీ జయరాజ్ గారు ఆద్యంత్యం అద్భుతంగా రచించారు. గాయకుడి ఆర్ద్రత తో తన గళం ద్వారా మమ్మల్ని కట్టిపడేసిన వైనం చిత్రీకరించిన తీరు అద్భుతం.🙏 ఈ పాట వెనుకాల కష్టపడిన వాళ్ళ అందరికి ధన్యవాదాలు❤❤ 1 Mohan Ballepall Music Director& Singer This is a great song that deserves to be spread all over the world. An english translation of the lyrics will help for people other than Telugus also to enjoy. This will become an Epic in our culture. మానవ జీవన సారమంత సాహిత్య పుటలుగ పేర్చి ప్రమాదకరంగ మారుతున్న మనిషికి సందేశం పంపిన జయరాజ్ గీత కావ్యం!🙏 మా, సంగీతమా లేక గానమే ప్రాణం పోసిందా? ఏమి చెప్పలేం 👌🏽👌🏽👌🏽🙏🏽 జయరాజ్ sir గారికి, గీతాలాపన చేసిన విజయ్ యేసుదాస్ గారికి , డైరెక్టర్ బొమ్మకు మురళి గారికి , సంగీత దర్శకులు టీమ్ సభ్యులు అందరికీ ధన్యవాదములు,నైతిక విలువలను పెంచి ప్రపంచ ప్రజలకు మంచి మార్గం చూపిన జయరాజ్ sir గారికి నా వందనాలు,అందరికీ వందనాలు. స్వరం మధురం, రచన రసరమ్యం, ప్రకృతిలో పారవశ్యం, సంగీత దర్శకులకు సలాం సలాం, అందరికీ పాదాభివదనాలు 🙏🙏🙏 రియల్లీ ఈ పాట కూ సహకరించి వారి ఆందరికి శత కోటి వందనాలు 👏👏💐🙏 పాట అద్భుతం రచయితకు,గాయకుడికి,సాంకేతిక నిపుణులకు హృదయ పూర్వక అభినందనలు 🌷పాట చక్కగా ఆలపించిన విజయ్ జేస్ దాస్ గారు తండ్రికి తగ్గ తనయుడనిపించుకొన్నారు. అభినందనలు..మంచిసందేశాత్మక గీతం అందరికీ అభినందనలు.. ఈరోజు నుండీ ప్రతిరోజూ తప్పక వినాలనుకొంటున్నాను..🌷 సుదీర్ఘమైనపాట..అలా వింటూ ..సమయం తెలియలేదు.👏👏👏👏 పాడిన వారికి వ్రాసిన వారికి అందరికీ పాదాభివందనం సూర్య చంద్రులు ఇచ్చే కాంతి వెన్నెల వలే నీవు రాసిన పాటలకు ఈ పుడమితల్లి పులకరిస్తుంది ఈ పాట ఎంతో అందంగా మలచి రాసిన వారికి, ఎంతో తియ్యగా పాడిన వారికి వందనాలు శతకోటి దండాలు ❤ మనిషిలో దైవత్వాన్ని నిలిపి, మనసులో మాటలకందని మాధుర్యాన్ని నింపే అద్భుతమైన పాట జయరాజు అన్న మీ మేధస్సుకు మీ రచన జ్ఞానానికి నా శిరస్సు వంచి పాదభి వందనం చేస్తున్న Yesudas anna మీ గళం మీ గానం స్వర్గతుల్యమైనది ఈ సమాజానికి జ్ఞాన సంపద నిధి ఐనది సృష్టి రహస్యాన్ని, జీవిత పరమార్ధాన్ని, జీవన గమనాన్ని, ప్రకృతి నియమాల్ని 23 నిమిషాల్లో జయరాజ్ గారు రచనతో, విజయ్ గారి గాత్రం తో మనకు తెలియజేశారు. ఇది ఒక్కటి వింటే చాలు మన పుట్టుకి అర్థం, పరమార్ధం అన్నీ తెలుస్తాయి. ఇంతటి అద్భుతమైన సందేశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు. తన పర మరచి సర్వం సమానంగా చూస్తే కలిగే అను భూతి ఎలావుంటుందొ చూపిన పాటను తీసిన బ్రృందానికి జోహార్లు.❤❤❤ Wonderful song after a long time Kudos to Jaya Raj Sir for your good lyrics No words to express the awesome singing of Vijay Jesudas 💐💐💐 2 months ago నిజంగా... శిలా నీవే...శిల్పి నీవే...శిల్పం నీవే...మీ ముగ్గురికీ మనఃపూర్వక ధన్యవాదాలు ఓం నమఃశివాయ 🙏 అద్భుతం అంటే చాలా అద్భుతమైన సందేశం తో కూడిన ఎంతో అర్ధ వంతమైన పాట ను మాకు అందించారు మీకు అందరికీ చాలా ధన్యవాదములు అండీ ఈ పాట గురించి నేను సోషల్ మీడియా లో కూడా పోస్ట్ చేసాను. సృష్టి లో ప్రకృతి గురించి ఈ పాట ద్వారా జీవిత సందేశాన్ని ఇంత గొప్పగా వర్ణించి చెప్పారు ఇంత మంచి గానామృతాన్ని అందించినందుకు మీకు అందరికీ ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా ఎన్ని నమస్కారాలు చేసినా చాలా తక్కువే అవుతుంది 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏ఇలాంటి గానామృతాలను ముందు ముందుకు మరెన్నో మాకు అందించాలని వేడుకుంటున్న 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 I am 76 year old. I never watched a song 7 to 8 times on same day as I did today. Everything is excellent. Thanks to whole team. 🙏🙏🙏 Mohan Ballepall Music Director& Singer జయ రాజన్న .....మీ పాట ఒక అద్భుత కళా ఖండం .కాల గమనంలో మనిషి జీవన గమనాన్ని అమోఘంగా చిత్రించారు ....💐💐💐🙏🏻🙏🏻🙏🏻 Mohan Ballepall Music Director& Singer Excellent song. Excellent voice and Excellent meaning. Daily I am listening atleast two times. Thank you very much for whole team especially Vijay J esudas. Each and every lyric highlights the diversified mammoth creation which makes us exuberant and ecstatic while going through this melodious song by Vijay Jedudass.Hats after the lyrics writer who poured his heart to couch these Gems of impactful words. Simply indescribable. One Can, rather one should listen this song as many times as convenient. Mohan Ballepall Music Director& Singer జయరాజు గారు మీ విడియో ప్రశాంత వాతావరణంలో నిద్రపోయే ముందు చివరి వరకు విన్న తర్వాత నాలో తెలియని కదలికలు ఉద్భవించాయి. మనుష్యులలో మానసిక పరివర్తన జరగడానికి,పెరగడానికి మీరు సమాజానికి అందించిన వాస్తవమంటే ఇదే. పాడిన వారు ఎంత చక్కగా నిరక్షరాస్యులకు కూడా అర్థమయ్యే రీతిలో పాటను వినిపించడం కూడా భగవంతుని ఆశీర్వాదమే.వారికి సమర్థ సద్గురు శ్రీ సాయినాధ మహరాజ్ వారి ఆశీస్సులు ఎల్లప్పుడూ సుసంపన్నంగా ఉండాలనే కోరుకుంటూ , ప్రతీ రోజు నిద్రపోయే ముందు మీ విడియో విని నాలో మెదిలిన ఆలోచనలకు గల పరివర్తన కొరకు ప్రయత్నంగా ఈ విడియో భద్రపరచుకోవడమైనది. నేటి సమాజానికి మీరు అందించిన విలువైన ఈ బంగారం కంటే ఇంకేమి ఉంది. ఎవరికి ఏమి కావాలి. మీకు ఏవిధంగా కృతజ్ఞతలు తెలియజేయాలో గాని ఈ కామెంట్ ద్వారా నా హృదయ పూర్వక నమస్కారములతో పాటు పాదాభివందనాలు. 🎉🎉❤🎉🎉🎉 A great song by Jairaju garu and greatly sung by Vijay and equally the credit goes to the composer. ఈ పాట లోని అర్థం ,మనిషి నవ నాడుల్లోని ,జవసత్త్వాలు ,స్పందించి ఈ యవనిక పై నూరేళ్ల జీవితానికి ఇదేనా అర్థం అనిపించింది.😅❤
SADHKUDU_WEB SIGHTS_USEFUL FOR EVERY ONE
- The Soul Travelers
- అమృతస్యపుత్ర:
- భవఘ్ని గురూజీ
- సాధకుడు
- పిరమిడ్ ధ్యానం - బ్రహ్మర్షి పత్రిజీ
- అపరోక్షానుభూతి
- spiritual gallery
- శ్రీ మాతా
- పరమపద సోపానం
- OM TAT SAT
- దేవుని వాక్యము
- యోగ తారావళి
- ఏక శ్లోకి
- उपनिषद् गंगा
- BHAGAVAN SRI SATYA SAI
- బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు
- బ్రహ్మ సూత్రాలు
- Adi Shankara Acharya
- జీవిత పరమార్థం
- భజగోవిందము
- అసంగోహం
- సన్నిధి
- వివేక వాణి
- గురువాక్యం
- Achala Paripurna Rajayoga Siddhanta
- ADVAITA VISISTADVAITA DVAITA
- Aparokshaanubhuti
- BALANTRAPUVARI BHAKTITATWAM-బాలాంత్రపువారి భక్తితత్త్వం
- Bhagavad Geetha
- BHAGAVAN SRI SATYA SAI
- bhargavasarma
- Bhavanajagat.
- Devotional Songs
- Guru Peetham
- HARE RAMA HARE KRISHNA
- Jnana Jyoti - Hindu Spiritual Videos, Articles, Books, Stories - Videos and Teachings of Vivekananda, Ramana Maharshi, Chinmayananda, Yogananda, Nisargadatta, Advaita Vedanta
- NAADAvidyaaLAYAM
- OM TAT SAT
- Quantum studies Sri Lanka HOME
- SATHYAANVESHANA
- Satyanveshana - A Spiritual Blog in Telugu
- SELF-KNOWLEDGE
- Space Theology (Astrotheology)
- SPIRITUALITY AT ITS BEST
- Sri Ram Raksha Stotra श्रीरामरक्षा स्तोत्र
- SUNDARA VIGNANA GRANDHALAYAM సుందర విజ్ఞాన గ్రంధాలయం
- Swami Vivekananda - MY INDIA Eternal
- Swaramanjari
- TELUGUDEVOTIONALSWARANJALI
- The Advaith
- vedanta's Blogs
- Vidyaranya Swami
- Yoga Vaasishta
- అంతర్వాహిని
- అన్నమాచార్య సంకీర్తనలు - వివరణలు
- అమ్మదయ
- ఆది శంకరాచార్యుడు
- ఆలోచనా తరంగాలు
- ఉపనిషత్తులు - మన మహోన్నత విజ్ఞానము
- గీతాసత్సంగం
- గురు రమణ మహర్షి
- తత్వ విశ్లేషణ :
- నైమిశారణ్యం
- పరమపద సోపానం
- పెద్దలు చెప్పిన మంచి మాటలు
- భక్తి
- భక్తి సామ్రాజ్యం
- భగవాన్ స్మృతులు
- భాగవత కథలు
- భారతీయం
- రామ-చిలక-పలుకులు
- వాగ్దేవతామాశ్రయే
- శ్రీ కామాక్షి
- శ్రీ గీతామృత తరంగిణి (శ్రీ పూడిపెద్ది కాశీ విశ్వనాథశాస్త్రి ఆంధ్రపద్యానువాదము)
- శ్రీనివాసం
- శ్రీలలిత సేవా సమితి
- షణ్ముఖసదనం
- సాయి వాణి
- స్మరణ
- హరిసేవ
మానసిక ఆనందం
మానసిక ఆనందం
★★★★★★★
శత్రువులు మనపై దాడి చేయడానికి ఎప్పుడూ పొంచి
ఉంటాయి.పౌరాణిక యుద్ధాలలో ఒక ఆయుధాన్ని మరొక
ఆయుధం జయించేది. శత్రువు అగ్ని బాణం వేస్తే
కథానాయకుడు నీటి బాణం వేసి ఆర్పేవాడు.ప్రతికూల ఆలోచన
బాణం మన వైపు దూసుకువస్తే ‘అనుకూల ఆలోచన’ అనే
అసాధారణమైన బాణాన్ని అందుకోండి…
‘మైండ్ మనం పెంచుకునే పూలతోట లాంటిది’
అంటారు ప్రఖ్యాత రచయిత రాబిన్శర్మ. ఆ తోటను ఎంతబాగా
చూసుకుంటే అంత అందంగా వికసిస్తుంది. అదే
నిర్లక్ష్యం చేస్తే ఆ తోటలో
కలుపుమొక్కలు పుట్టుకొస్తాయి. అలాగే వదిలేస్తే..
కలుపుమొక్కలు పెరుగుతూనే ఉంటాయి. కొన్నాళ్లకు ‘తోట’
అనే పదానికే అర్థం లేనట్టుగా తయారవుతుంది అంటారాయన.
కలుపుమొక్కలను తొలగించాలంటే పాజిటివ్ థింకింగ్ ఒక్కటే
సరైన ఆయుధం. అనుకూలమైన ఆలోచనలతో మన మైండ్లో
ఉన్న కలుపుమొక్కల్లాంటి నెగిటివిటీని దూరం చేసుకుంటే
శక్తివంతంగా ఎదుగుతాం.ప్రతిభ సమానంగా
ఉన్నవారందరిలోనూ పరాజితుల నుంచి విజేతలను వేరుచేసేది
వారి ఆలోచనలే.
ఆలోచనే మొదటి మెట్టు…
మన ఆలోచనలను విత్తుగా నాటితే అది చర్య అనే మొక్కలా
పెరుగుతుంది. ఆ చర్య దాన్ని మళ్లీ విత్తుగా నాటితే అది
అలవాటు అనే మొక్కలా పెరుగుతుంది. ఆ అలావాటునే విత్తితే
అదినడవడిక అనే పంటలా ఫలిస్తుంది. ఆ నడవడికనే నాటితే అది
మన అదృష్టాన్నే మార్చివేస్తుంది. అంటే ముందుగా మన
మైండ్లో ఒక ఆలోచన ఉదయించాలి.
రోజూ ఉదయం ఐదు గంటలకే నిద్రలేవాలనే ఆలోచన
వచ్చిందనుకుందాం. అదే ఆలోచన రోజూ కలిగితే ఒక
రోజు అనుకున్న సమయానికే మేల్కొంటాం. పనులను చకచకా
చేసేస్తాం. అదే రోజూ త్వరగా నిద్రలేవడం అనేది అలవాటుగా
మారి, పనులన్నీ సక్రమంగా చేస్తూ ఉంటే కొన్నాళ్లకు అది ఒక
క్రమశిక్షణ అలవడేలా చేస్తుంది. చివరకు అది మన
క్యారెక్టర్నే మార్చివేస్తుంది. అదే ఒకరిలో ‘మద్యం తాగాలి’ అనే
ఆలోచన కలిగిందనుకుందాం. ఒకరోజుతో ‘తాగడం’
మొదలుపెట్టి, దానిని రోజూ ఓ అలవాటుగా తాగుతూ పోతే
చివరకు అతని క్యారెక్టర్ అందరిలోనూ తాగుబోతుగా
ముద్రపడే అవకాశం ఉంది. అందుకే మొదట మైండ్లో
ఉదయించే ఆలోచన ‘మంచి, చెడు’ ఎలాంటి
క్యారెక్టర్ను సృష్టిస్తుందో మనకు మనమే చెక్ చేసుకోవాలి.
నెగిటివ్ చీడ…
నెగిటివ్ ఆలోచనలు చీడపురుగుల్లాంటివి. అవి
ఎప్పుడూ మైండ్ను తొలుస్తూనే ఉంటాయి. పాజిటివ్
ఆలోచనలతోనే వాటిని ఎదుర్కోగలం.
ఇంట్లో తల్లిదండ్రులు పిల్లలను, భర్తను భార్యను,
ఉద్యోగిని పై అధికారి తిట్టడం, దూషించడం వంటివి
చూస్తుంటాం. వారి మాటలు, ప్రవర్తన మనలో ఎంతో
నెగిటివిటీని నింపవచ్చు. ఇలాంటప్పుడు నిరాశ
నిసృ్పహలకు లోనైతే మరింత కుంగుబాటు తప్పదు.
మనల్ని మనం మరింత శక్తివంతంగా మలుచుకోవాలంటే ఆ
నిరాశను దూరం చేసుకోవాలి. ‘నా బాగు కోసమేగా ఇలా జరిగింది.
వారంత నెగిటివ్గా మాట్లాడినంత మాత్రాన
ఇప్పుడు కోల్పోయిందేముంది.. దీనిని సవాల్గా తీసుకొని
ఇంకాస్త ఉన్నతంగా ఎదగడానికి ప్రయత్నం చేద్దాం’ అని
ఎప్పటికప్పుడు మనల్ని
మనం అనుకుంటూ ప్రోత్సహించుకుంటే ఉంటే కొత్త
ఉత్సాహం చెంతకు చేరుతుంది. మరింత బాగా పని చేసి,
శక్తివంతులమవుతాం.
లోకంలో రకరకాల మనస్తత్వాలు గలవారు ఉంటారు. వారికి
తోచినట్టు వారు మాట్లాడుతుంటారు. ప్రవర్తిస్తుంటారు.
వీలైతే అలాంటి వారి నుంచి దూరంగా ఉండాలి. వారి స్థానాన్ని
పాజిటివ్గా ఉండేవారితో భర్తీచేయాలి. ఏ కారణంగానైనా మనలో
నెగిటివిటీ తొంగిచూస్తే ఒక్క పాజిటివ్ ఆలోచనతో దానిని రీప్లేస్
చేస్తే సరి అనుకూలమైన ఆలోచనలతో జీవితం ఆనందంగా మారినట్టే.
నిరాశావాదం మెల్లగానైనా తప్పుకుంటుంది.
గుడికి వెళ్లడమో, నచ్చిన సినిమా చూడటమో, కొత్త
వంటకం చేయడమో, పుస్తకం చదవడమో… ఏదైనా
మనసుకు నచ్చినపనిని చేస్తూ ఉండాలి. ఆ పనిలో కలిగే
సంతృప్తి నిరాశను తరిమికొడుతుంది.
ఒంటరిగా ఉండటంలో వచ్చే నిరాశాపూరితమైన
ఆలోచనలను వదిలించుకోవాలంటే నలుగురితో కలివిడిగా
ఉండాలి. వీలైనంతవరకు సహోద్యోగులతోనో,
బంధుమిత్రులతోనో, ఇరుగుపొరుగువారితోనో..
మాట్లాడుతూ, నవ్వుతూ, నవ్విస్తూ ఉండాలి.
ఇచ్చిపుచ్చుకునే ధోరణి పాజిటివ్నెస్ను పెంచుతుంది.
మనకు అందరూ ఉన్నారు అన్న భరోసాను ఇస్తుంది.
బలం, బలహీనతలు గుర్తించాలి
ఆలోచనలు విశాలంగా ఉండాలి. మన బలం, బలహీనతలేంటో
ఎవరికి వారు అనలైజ్ చేసుకోగలగాలి. అప్పుడే
బలహీనతలను తగ్గించుకునే ప్రయత్నం చేయగలం.
మరింత శక్తివంతులుగా మారగలం. అందుకే నెగిటివ్
ఆలోచనలను దరికి రానీయకుండా బలహీనతలను దాటడానికి
మనల్ని మన మే ప్రోత్సహించుకోవాలి. అలాగే మన
బలాలను గుర్తించి వాటిని ఇంకా బాగా వాడుకోవాలి.
ప్రతిసారి ఆ గ్లాసును శుభ్రం చేసుకోవాలి. అలా కాకుండా అదే
గ్లాసులో మళ్లీ మళ్లీ కాఫీ పోసుకొని తాగితే ఎలా ఉంటుందో ప్రతి
ఒక్కరు ఆలోచించగలిగితే మన మైండ్
మనకు అర్థమైపోతుంది. పాజిటివ్ ఆలోచనలు మళ్లీ మళ్లీ
రానిస్తే మన మైండ్ అలాగే తయారవుతుంది. ‘నాకు మంచి
జరగాలని నేను కోరుకోకపోతే ఈ ప్రపంచంలో ఎవ్వరూ కోరుకోరు’
అనుకున్నా పాజిటివ్ ఆలోచనలతో జీవితం హ్యాపీగా
గడిచిపోతుంది.
దైవ నిర్మితమైన ఈ సృష్టిలోని ప్రతి అంశాన్నీ ప్రేమించడం మన మొదటి లక్ష్యం, చివరి లక్ష్యం.
*గమ్యం - గమనం **జీవిత లక్ష్యం ఏమిటి? ఏ లక్ష్యమూ చేరుకోవాలనే కోరిక లేని
- స్థితిని చేరుకోవడమే జీవిత లక్ష్యం. ఏ గమ్యమూ అవసరం లేని సంపూర్ణ సంతృప్తి,
పరిపూర్ణ సుఖ ప్రవృత్తి - ఇదే లక్ష్యం. ఈ మాటలు సరిగ్గా అర్థం అయితే
'జీవించి' ఉండడమే జీవన లక్ష్యమని తెలుసుకుంటారు. 'ఉల్లాసకరంగా', 'ఉత్తేజ
భరితంగా' జీవిస్తూ జీవన ఫలం లోని మాధుర్య రసాన్ని జుర్రుకోవడమే నీ లక్ష్యం.
నీ గమ్యమేమిటని నదిని అడుగు. సముద్రంలో చేరడమంటుంది. సముద్రాన్ని అడుగు,
జవాబు దొరకదు. చిన్న నదికి గమ్యం ఉంది. పెద్ద కడలికి పెద్ద గమ్యం ఉండాలి
కదా! అసలేమి లేదు. *
*నీవు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా జీవిస్తుంటే అది చాలు. నీ జీవిత
లక్ష్యం నెరవేరి పోయింది. అసలైన లక్ష్యాలన్నీ ఎప్పుడో ముందుగానే
సాధింపబడినాయి. ఇప్పుడు నువ్వు సాధించ దలచుకున్నవి ఎంత చిన్నవైనా, ఎంత
పెద్దవైనా సరే, కేవలం ఆభరణాలు మాత్రమె. అలంకార ప్రాయమే. ఇక్కడ రెండు విభిన్న
విషయాలున్నాయి. ఒకటి లబ్ది దారుడు. రెండు లభ్య వస్తువు. మంచి ఉద్యోగం,
పెద్ద జీతం, ఇల్లు, హోదా - ఈ లక్ష్యాలు సామాజిక భూషణాలు. మంచి భార్య, చక్కటి
పిల్లలు - ఇవి భౌతిక ఆభరణాలు. లభ్య వస్తువు కంటే లబ్ది దారుడే గొప్పవాడు.
ముత్యాలహారం కంటే దానిని ధరించిన కంఠం గొప్పది. వజ్రపు ముక్కెర కంటే సంపంగి
ముక్కు విలువైనది. 'అమ్మాయి' నామ వాచకం. ఆమె ధరించిన 'నగ' విశేషణం. హారం
పోయినా పర్వాలేదు, కంఠం ఉంది. అదే పదివేలు, కాదు పది కోట్లు. ముక్కెర
లేకపోయినా నష్టం లేదు. ముక్కు ఉంది. అదే మహాభాగ్యం.నీ తలపై ధరించే తలపాగా
లేదా నవరత్న ఖచిత కిరీటం కంటే, నీ తల చాలా విలువైనది. అలాగని మకుటం లోని
మణులను తేలిక చెయ్యడం కాదు. కిరీటపు వన్నె చిన్నెలను తక్కువగా చెప్పడం కూడా
కాదు. నీకు కిరీటం కావాలని తీవ్రమైన కోరిక ఉంటే కష్టించు. అన్వేషించు,
శతవిధాల ప్రయత్నించు. సాధించు. తప్పులేదు. కానీ, దానికోసం లేనిపోని
తలనొప్పి తెచ్చుకోకు. తల బొప్పి కట్టించుకోకు. తల తాకట్టు పెట్టకు. శిరో
భూషణం కంటే శిరస్సు అమూల్యమైనదని గ్రహించిన తర్వాత, కిరీటం కోసం
ప్రయత్నించు. అపుడు నీ ప్రయత్నం ప్రమోదభరితం గా ఉంటుంది. ఒక మంచి వక్తను
చూడండి. చక్కటి కృషితో భాషా విజ్ఞానం సంపాదించాడు. వాక్పటిమను
పెంచుకున్నాడు. ఏ విషయం గురించైనా అనర్గళంగా, అలవోకగా మాట్లాడే సామర్థ్యం
తెచ్చుకున్నాడు. అతని చతుర సంభాషణా శైలిని అందరూ పొగుడుతున్నారు. అది అతనికి
ప్రత్యెక అలంకారం. ఇక మన విషయం చూద్దాం. మనకు మాట్లాడే శక్తి ఉంది. దైనందిన
వ్యవహారాల్లో ఇతరులతో మాట్లాడగలం. ఇది మనందరికీ గర్వకారణం. చాకచక్యంగా
సంభాషించలేక పోవచ్చు. ప్రయత్నిస్తే సాధ్యపడుతుంది. ఒక్కమాటైనా పలుకలేని
మూగవారి గురించి ఆలోచించండి! వారికంటే మనమెంత అదృష్టవంతులం! ఒకసారి సరదాగా
మిత్రులతో అన్నాను, నేను విశేషణాలు, ఆభరణాలు లేని నగ్నమైన నామవాచకాన్ని అని.
'నేను నేనుగా' ఉన్నాను. 'నీవు నీవుగా' ఉన్నావని గర్వపడాలి. నీకున్నవి ఏవైనా
సరే, నీకంటే గొప్పవి కావు. ఎంతో ఖరీదైన బూట్లు నీ పాదాల కంటే చాలా
అల్పమైనవి. అద్భుతమైన జీర్ణశక్తిని ప్రకృతి మనకు వరంగా ఇచ్చింది. ఎప్పుడైనా
అజీర్ణ వ్యాధి బారిన పడితే అప్పుడీ విషయం అనుభవంతో అర్థమవుతుంది. భోజనం
చేయడం, జీర్ణం చేసుకుని శక్తిగా మార్చుకోవడం మామూలు విషయం కాదని అప్పటికి గానీ
తెలిసి రాదు. ఆసుపత్రిలో ఒక్కసారి డయాలసిస్ చేయాలంటే, రెండు - మూడు వేలు
ఖర్చు అవుతుంది. మన కిడ్నీలు రోజుకు నలభై ఎనిమిది సార్లు డయాలసిస్ చేస్తాయి.
అంటే రోజుకు లక్ష రూపాయలను మనకు కిడ్నీలు సంపాదించి పెడుతున్నాయి. కిడ్నీలు
బాగున్న ప్రతి వ్యక్తీ కోట్లకు పడగలెత్తినట్లే. మన ప్రతి అవయవమూ
అమూల్యమైనది. ఈ శరీరం అనంతకోటి నిధులకు నిలయం. నువ్వు జన్మించిన క్షణంలోనే
నీ లక్ష్యం నెరవేరింది. నీకిక వేరే గమ్యమేమీ లేదు. జీవించి ఉండడమే నీ పరమ
గమ్యం. ఇదే మహోన్నత లక్ష్యం. గొప్ప గొప్ప లక్షణాలుగా నువ్వు భావించేవన్నీ నీ
ఉనికి కంటే చాలా చిన్నవి. కాబట్టి, అవి సాధించినా పెద్ద తేడా ఏమీ ఉండదు.
సాధించకపోయినా ఇబ్బంది లేదు. పువ్వును అడగండి, నీ ఆశయమేమిటని? వికసించి
చూపిస్తుంది. పసిపాపను ప్రశ్నించండి, బోసినవ్వును సమాధానంగా ఇస్తుంది.
పక్షి లక్ష్యం హాయిగా ఎగరడమే. నీ లక్ష్యం ఆరోగ్యంగా, ఆనందంగా బ్రతకడమే.
శరీరం నిరంతరం శ్రమించినా, మనసును శాంతంగా సుఖించనీ! కూడు, గూడు నిత్యావసరాలకు
సరిపడినంత ధనం ఇవి నిజమైన లక్ష్యాలు. ఉత్సాహంగా, ఉత్తేజంగా జీవించడం అంతకంటే
మహదాశయం. మనిషిగా జన్మించి మానసికంగా, శారీరకంగా, ఆరోగ్యంగా ఉంటే అతి గొప్ప
గమ్యాన్ని చేరుకున్నట్లే, సాధించవలసిన లక్ష్యాన్ని సాధించినట్లే. ఆ తరువాత
మనం చేరబోయే గమ్యాల గమనం, మనకు ఇదివరకే పరమాత్మ ప్రసాదించిన పరమ గమ్యాన్ని
(జీవించి ఉండటం) చేరేలా ఉండాలి, దాని గాఢతను పెంచేలా ఉండాలి. మనం
సాధించాలనుకున్న ఇతర లక్ష్యాలన్నీ, మనకు సృష్టికర్త మన తరఫున సాధించిన లక్ష్యం
(ఆరోగ్యంగా జీవించడం) యొక్క కక్ష్యలో తిరుగుతూ, ఆ లక్ష్యానికి మరింత ఆనందాన్ని
కటాక్షించాలి. అంతే కానీ, పరమాత్మ తన అనంత మేధస్సును ధారపోసి మనకు వరంగా
ప్రసాదించిన జీవన ధనాన్ని మన దృష్టిలో పెద్దగా కనబడే చిన్న లక్ష్యాలను
సాధించడానికి వృధాగా ధారపోయరాదు. దైవాన్ని ప్రేమించడం, దైవ నిర్మితమైన ఈ
సృష్టిలోని ప్రతి అంశాన్నీ ప్రేమించడం, ప్రకృతితో తాదాత్మ్యం చెందడం మన మొదటి
లక్ష్యం, చివరి లక్ష్యం. *
*ఆడడం నెమలి లక్ష్యం. పాడడం కోయిల లక్ష్యం ఆడుతూ పాడుతూ బ్రతకడం మనందరి
లక్ష్యం *
--
*ఓం నమో భగవతే వాసుదేవాయ *
*సర్వం శ్రీ ఆంజనేయ స్వామి పాదారవిందార్పణమస్తు*
*కె.బి. నారాయణ శర్మ - **నాకు తెలిసింది అల్పం తెలుసుకో వలసినది అనంతం.*
నిత్యజీవితంలో మనం ఆచరించాల్సిన విషయాలు
నిత్యజీవితంలో మనం ఆచరించాల్సిన విషయాలు
2. మంత్రోపదేశం చేసినవారు మాత్రమే గురువు. (తక్కిన విద్యలు నేర్పినవారు అధ్యాపకులు మాత్రమే) అట్టి గురువును ఏ పరిస్థితిలోనూ నిందించరాదు. ఆయన ఎదురుగా కాళ్ళుచూపి కూర్చోరాదు.
3. భోజనం తూర్పు, ఉత్తర దిక్కులవైపు కూర్చొని చేయాలి.
4. నడుస్తూ కాని, నిలబడి కాని మలమూత్రాదులు విడువరాదు.
5. బట్టలు ధరించకుండా నదులలో స్నానం చేయరాదు.
6. దేవాలయాల్లోనూ, గోశాలలోను మలమూత్రాదులు విడువరాదు.
7. మలమూత్ర విసర్జన ఉత్తర, దక్షిణ దిశలుగా మాత్రమే చేయాలి.
8. తూర్పు, దక్షిణ దిక్కుల తల పెట్టి నిద్రపోవాలి, ఉత్తర, పశ్చిమాల వైపు తల పెట్టి నిద్రిస్తే వారు ప్రమాదాల పాలౌతారని మార్కండేయ పురాణం చెబుతుంది.
9. ఇంటికి గురువు వస్తే టక్కున లేచి నిలబడి ఎదురుగావెళ్ళి లోపలికి గౌరవంగా తీసుకొని వచ్చి ఆసనం వేసి కూర్చోబెట్టకుండా మాట్లాడరాదు. సాగనంపేటపుడు బయటకు వచ్చి గురువుని కొంచెం దూరం అనుసరించాలి.
10. పైన అనగా భుజాలమీదుగా వస్త్రం లేకుండా దైవపూజ చేయరాదు, భోజనం చేయకూడదు.
11. రెండు చేతులతో ఎప్పుడూ తల గోక్కోరాదు.
12. గురుపాపం ఎవరికీ చెప్పరాదు. గురువునకు కోపం వస్తే తక్షణం ప్రసన్నం చేసుకోవాలి.
13. ఇతరుల చెప్పులు, వస్త్రాలు ధరించకూడదు.
14. చతుర్దశి, అష్టమి దినాలలో తలంటు పనికిరాదు. స్త్రీ సంగమం పనికిరాదు.
15. అన్నము తిన్నాక కంచంలో చేయి కడుక్కోరాదు. చేయి కడిగిన తరువాత ఆ చేతిని విదల్చరాదు.
16. గురువు కోరితే ఏదైనా ఇమ్మని శాస్త్ర వచనం. అటువంటి గురువును ఏ పరిస్థితిలోను అసహ్యించుకొనరాదు. 10వేల యజ్ఞాల ఫలితం కూడా ఈ ఒక్క కార్యంతో నశించిపోతుంది. కనుక గురుధిక్కారం పనికిరాదు.
17. పిసినిగొట్టుతో, శత్రువుతో, అసత్యం పలికే వాడితో భర్తను తిట్టే స్త్రీతో కలిసి భోజనం చేయటం మహాపాపం.
18. స్నానం చేయకుండా అన్నం వండరాదు. ఆ అన్నం తినరాదు.
19. నోటితో అగ్నిని ఆర్పరాదు, ఊదరాదు.
20. పురాణాలు చెప్పే వ్యక్తి సర్వోత్తముడు. అటువంటి వారిని నిందించరాదు.
21. పుణ్య కార్యాల్లో చోళ్ళు, జొన్నలు, వెల్లుల్లి, ఉల్లి, చద్ది పదార్థాలు తినరాదు, ఉపయోగించరాదు.
22. ప్రయాణం మధ్యలో భోజనాదులకు నియమంలేదు.
23. తడిసిన బట్టల నీళ్ళు ఇతరులపై పడేట్లు విదిలించరాదు.
24. ఎట్టి పరిస్థితులలోను ఆత్మహత్య చేసుకోరాదు. అలా చేసుకున్నవారు కొన్ని వేల జన్మలు పిశాచ జన్మలెత్తి వికలాంగులై పుడతారు.
25. తెలిసినవారి మరణ వార్త విన్న వెంటనే గాని, పురిటి వార్త విన్న వెంటనే గాని కట్టుబట్టలతో స్నానం చేయాలి.
26. పుష్కర స్నానాదులలో చొక్కాతో స్నానం చేయరాదు. కండువా మాత్రమే ఉండవలెను.
27. ఏకాదశి నాడు ఎన్ని అన్నంమెతుకులు తింటే అన్ని పురుగులు తిన్నట్లు లెక్క అని శాస్త్ర వచనం. కావున అన్నం భిన్నం చేసుకొని తినాలి. ఒక్క నిర్జలైకాదశి అనగా జేష్ఠ శుద్ధ ఏకాదశి నాడు మాత్రం ఫలహారం కూడా పనికి రాదు. 60 సం.లు దాటిన వారికి, 11 సం.లు లోపు వారికి ఈ నియమం వర్తించదు. అనారోగ్య వంతులకు ఈ పై నియమాలు లేవు.
28. కూర్చొని తొడలు, కాళ్ళు ఊపరాదు. అలా ఊపినవాడు వచ్చే జన్మలో కుంటివాడై పుడతాడు.
29. తూర్పు, ఉత్తరముఖంగా దంతధావనం చేయాలి. పడమర, దక్షిణ దిక్కుగా నిలబడి చేయకూడదు.
30. ఉమ్ము మాత్రం తూర్పు, పడమరగా వేయరాదు.
.......................................................
మహిళలు నిత్యం అభరణాలు ధరిస్తారు. సందర్భాన్ని బట్టి అవి మారుతూ ఉంటాయి. అయితే గ్రహాలను అనుసరించి ఆభరణాలు ధరించాల్సి ఉంటుంది. ఏ రోజు ఏ రకమైన నగలు ధరిస్తే మంచిదో తెలుసుకోవడం ముఖ్యం.
వారంలో రోజుకో గ్రహాధిపతి ఉంటాడు. ఆదివారానికి సూర్యుడు అధిపతి అయితే, శుక్రవారానికి శుక్రుడు అన్నట్టు.. ఆయా వారాలన్ని బట్టి ఆ రోజుకి ఉండే గ్రహాదిపతిని అనుసరించి ఏ నగలు ధరించాలో తెలుసుకోవాలి. నిత్యం నవగ్రహాలను అనుసరించి ఆభరణాలు ధరించడం ద్వారా శుభఫలితాలుంటాయి.
అయితే బంగారంతో పొదిగించిన ఆభరణాలు లేకపోయినా.. తమ తమ స్థోమతకు తగినట్లు ఇప్పుడు దుకాణాల్లో అమ్మబడే ఆభరణాలతో ప్రతిరోజూ అలంకరణ చేసుకోవడం మంచిది.
ఇక ఏ వారంలో ఎలాంటి ఆభరణాలు ధరించాలో తెలుసుకుందాం.
.......................................................
గతంలో రాగి చెంబు, రాగి బిందె, రాగి గ్లాసు, రాగి ప్లేటు ఇలా ఎక్కువగా రాగి వస్తువులనే వాడే వారు. కాని నేడు ఫ్యాషన్ ఎక్కువయ్యి ప్లాస్టిక్ వచ్చిపడింది. దాంతో రాగి పాత్రల వాడకం బాగా తగ్గిపోయింది. నీళ్ళు తాగాలంటే ప్లాస్టిక్ బాటిల్స్, లంచ్ బాక్సులు కూడా ప్లాస్టికే. నేటి ఇళ్ళు మొత్తం ప్లాస్టిక్ సామానుల మయమైపోయాయి. అయితే రాగి పాత్రలు వాడడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
.............,.........................................
దుర్గాదేవి ప్రీతి కోసం చీర, రవికల గుడ్డ, గాజులు, పువ్వులు అన్నీ ఎర్ర రంగులో ఉండేవి దానం ఇవ్వాలి. దీని ద్వారా శక్తి సామర్థ్యాలు, ధైర్యం పెరిగి, కార్య జయం కలుగుతుంది.
.....................................................
మానవుల కోరికలు, పాపాలు, అసంతృప్తులో వారి దుఃఖానికి కారణం. దీని వలనే మనం అశాంతి పాలవుతుంటాం. అలాంటప్పుడు పరమేశ్వరుడిని అభిషేకిస్తే పాప విముక్తులయి, దుఃఖం దూరమవుతుంది. ఆనందం ఆదిదేవుని ఆశ్వీర్వాదంగా లభిస్తుంది.

భారతీయ సంస్కృతిలో తులసికి ప్రత్యేక స్థానం ఉంది. తులసిలేని హిందువుల ఇల్లు ఉండదు. తులసి లక్ష్మీ స్వరూపం. అసలు తులసి మొక్కకు ఎందుకంత ప్రాధాన్యత ఇచ్చారు? తులసి ప్రత్యేకత ఏమిటి?
మన పూర్వీకులు దేనినైనా పూజించండి అంటే, అందులో ఆధ్యాత్మిక, ఆరోగ్య, వైజ్ఞానిక కారణాలు తప్పకుండా ఉంటాయి. మనకు అవి తెలియవి, అంతే. తులసి గురించి ఒక నాలుగు మాటలు చెప్పుకుందాం.
మాములు మొక్కలు, చెట్లు ఉదయం మొత్తం కార్బన్-డై-ఆక్సయిడ్ పీల్చుకుని, ఆక్సిజెన్ వదులుతాయి, రాత్రి సమయంలో ఉదయం తాము పీల్చుకున్న కార్వన్-డై-ఆక్సైడ్ మొత్తాన్నీ పర్యావరణంలోనికి విడిచిపెడతాయి. కానీ తులసి మాత్రం రోజులో 22 గంటల పాటు ఆక్సిజెన్ (ప్రాణవాయువు) ను విడిచిపెడుతుందని మన భారతీయుల పరిశోధనలో తేలింది. వృక్షజాతిలో మరే మొక్కకు ఈ ప్రత్యేకత లేదు.
తులసి ఔషధగని. తులసిలో ప్రతి భాగం ఆయుర్వేద చికిత్సలో వాడుతారు. తులసి కున్న ఘాటైనవాసన కారణంగా తులసి వాసన వ్యాపించినంత మేర ఈగలు, దోమలు, పాములు రావు. అందుకే మనం సంప్రదాయంలో ఇంటి ముందు, వెనుకా కూడా తులసిమొక్కను పెట్టి పూజించమన్నారు, ఫలితంగా ఇంట్లోకి పాములు రాకుండా ఉంటాయి.
తులసిలో విద్యుత్ఛక్తి అధికంగా ఉందని ఆధునిక వైజ్ఞానిక శాస్త్రజ్ఞులు కనుగొన్నారు. వేదంలో కూడా వృక్షాల్లో ఉన్న విద్యుత్ గురించి ప్రస్తావన ఉంది. తులసి ఏ ఇంటిలో ఉంటే, ఆ ఇంటి మీద పిడుగు పడదని పరిశోధకులు తేల్చారు. తులసిలో ఉన్న ఈ విద్యుత్ శక్తిని మనం శరీరం గ్రహిస్తే, ఆరోగ్యం చేకూరుతుంది, అందుకోసమే తులసమ్మకు నీరు పోసి, చుట్టు ప్రదక్షిణం చేయాలి. అప్పుడు తులసిలో ఉన్న శక్తి భూమి ద్వారా, ఆరికాళ్ళలోకి చేరి, నాడీ మండలాన్ని ప్రభావితం చేస్తుంది.
తులసి ఎంత గొప్పదంటే తులసి వనంలో పెట్టిన శవం ఎంతకాలమైనా చెడిపోదని మన ఆయుర్వేద గ్రంధాలు చెప్పాయి. దీన్ని ఆధునిక శాస్త్రవేత్తలు కూడ అంగీకరించారు.
ప్రపంచాన్ని హడలుగొట్టిన స్వైన్ప్లూ భారత్లో స్వైరవిహారం చేయకుండా అడ్డుకున్నది తులసి మొక్కేనని తేలింది. తులసి గాలి కారణంగా జనంలో స్వైన్ప్లూను తట్టుకునే రోగనిరోదక శక్తి పెరిగిందట. అంటే మన తులసమ్మ మనకు ఆయుషు పోసిందన్నమాట. ఏ ఇంట్లో అధికంగా తులసిమొక్కలు ఉంటాయో, ఆ ఇంట్లో జనం ఆరోగ్యంగా ఉంటారు.
తులసిచెట్టు కాలుష్య ప్రభావాన్ని తగ్గిస్తుంది. తాజ్మహల్ కాలుష్యం బారినపడి మసకబారకుండా ఉండడం కోసం, తాజ్మహల్ పక్కనే, లక్ష తులసి మొక్కల వనాన్ని ప్రత్యేకంగా పెంచారు. అట్లాగే తులసి చెట్టు దగ్గర చేసే ప్రాణాయామం, ధ్యానం, యోగా మరిన్ని మంచి ఫలితాలని ఇస్తాయి. కాలుష్య జీవనంలో కనీసం మనిషి ఒక తులసి మొక్కైనా పెంచాలి.
నల్గోండ జిల్లాలో ఫ్లోరోసిస్ వ్యాప్తిని తగ్గించడానికి ప్రభుత్వం ఎంతో ప్రయత్నం చేస్తోంది. తులసి ఆకులు నీటిలోని ఫ్లోరోసిస్ వ్యాపితిని తగ్గిస్తాయని ఏ మధ్యే దృవీకరించారు. మనం పెరటి తులసిని సక్రమంగా వాడుకుంటే, రూపాయి ఖర్చు లేకుండా అనేక మంది జీవితాల్లో వెలుగు నింపవచ్చు. ఇది తులసి మహాత్యం.
తులానాం నాస్తి ఇతి తులసి అన్నారు, దేని గురించి ఎంత చెప్పుకున్నా, ఇంకా చెపుకోవలసినది మిగిలి ఉంటుందో, దాన్ని తులసి అంటారని అర్దం. తులసి ప్రాధాన్యత గుర్తించారు కాబట్టే జపాన్లో కూడా ప్రతి ఇంటిలో తులసి చెట్టు తప్పక పెంచుతారు .
.....,................................................
పిల్లలకు ‘9 ‘ వ నెలలో కాని, ’11 ‘వ నెలలో కాని, ‘3 ‘వ సంవస్తరం లో కాని తీయవలెను.
.....,.................................................
ఆడ పిల్లలకు ‘5 ‘ వ నెలలో, మగ పిల్లలకు ‘6 ‘ వ నెలలో అన్న ప్రాసన చేయాలి. 6 నెల 6వ రోజున ఇద్దరికీ పనికివస్తుంది.
.................................................
ఆవు పాలు,ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, పంచదార, వీటిని పంచామృతం అని,
ఆవు పాలు,ఆవు పెరుగు, ఆవు నెయ్యి, ఆవు పేడ, ఆవు మూత్రము, వీటిని పంచగవ్యములు అంటారు.
..,....................................................
ద్వారానికి పైనున్న కమ్మి లక్ష్మి స్వరూపము, అందుకే దానికి మామిడి తోరణం కడతారు. క్రింద కమ్మి పవిత్రమైనది, కనుక దానికి పసుపు రాస్తారు. శాస్ర పరంగా చెప్పాలంటే గడప కు పసుపు రాయడం వల్ల క్రిమి కీటకాలు, విష పురుగులు ఇంట్లోకి రాకుండా ఉండటానికి అనుకోవచ్చు.
.......................................................
తొలితీర్థము శరీర శుద్ధికి,శుచికి…రెండవ తీర్ధం ధర్మ,న్యాయ ప్రవర్తనకు …మూడవ తీర్ధం పవిత్రమైన పరమేశ్వరుని పరమ పదము కొరకు.
.........................................
అకాల మ్రుత్యుహరణం సర్వవ్యాది నివారణం
సమస్త పాప శమనం విశ్నుపాదోధకం శుభం .
.................................................
నది లో ప్రవహమునకు ఎదురుగ పురుషులు, వాలుగ స్త్రీలు చేయవలెను.
చన్నీటి స్నానము శిరస్సు తడుపుకొని, వేడి నీటి స్నానము పాదములు తడుపుకొని ప్రారంబించ వలెను.
స్నానము చేయునపుడు దేహమును పై నుండి క్రింద కు రుద్దు కొనిన కామేచ్చ పెరుగును. అడ్డముగా రుదుకోనిన కామేచ్చ నశించును.
సముద్ర స్నానము చేయునపుడు బయట మట్టి ని లోపలి వేయవలెను. నదులలో,కాలువలు,చెరువులలో చేయునపుడు లోపల మట్టిని ముమ్మారు బయట వేయవలెను.(అవి పూడి పోకుండా ఉండటానికి)
.....................................................
గృహంలో ఎంత చేస్తే అంత ఫలితం ఉంటుంది. నది ప్రాంతంలో చేస్తే రెట్టింపు ఫలితం వస్తుంది.
గోశాలలో చేస్తే వంద రెట్లు, యాగశాలలో అంతకు మించి ఫలితం వస్తుంది. పుణ్య ప్రదేశాల్లో,
దేవాతా సన్నిదిలోను చేస్తే పదివేల రెట్లు వస్తుంది. శివసన్నిదిలో చేస్తే మహోన్నతమైన ఫలం వస్తుంది. పులి తోలు మీద కుర్చుని జపిస్తే మోక్షం కలుగుతుంది. అలాగే వెదురు తడక మీద కుర్చుని జపం చేస్తే దరిద్రం ఆవహిస్తుంది.
రాతి మీద కుర్చుని జపిస్తే రోగాలు వస్తాయి. నేల మీద కూర్చొని చేస్తే దుఖము, గడ్డి మీద చేస్తే కీర్తి నాశనం అవుతుంది.
...................,.................................
తూర్పునకు అధిపతి ఇంద్రుడు, ఉత్తరానికి అధిపతి కుబేరుడు. అందుకే పూజగది తూర్పుముఖంగా కాని, ఉత్తరముఖం గా కాని ఉండాలని అంటారు. దక్షిణానికి అధిపతి యముడు. అందుకే దక్షిణ ముఖం గా ఉండకూడదని అంటారు.
....,..................................................
సూర్య భగవానుని 4.30 నుంచి ఆరులోగా పూజించాలి. ఈ సమయంలో పూజ శ్రీ రామునికి, శ్రీ వెంకటేశ్వరునికి కూడా ప్రీతీ. ఆరు నుంచి ఏడున్నర వరకు మహాశివుడ్ని, దుర్గను పూజించిన మంచి ఫలము కలుగును. మధ్యాహ్నము పన్నెండు గంటలప్పుడు శ్రీ ఆంజనేయ స్వామిని పూజించిన హనుమ కృపకు మరింత పాత్రులగుదురు. రాహువునకు సాయంత్రము మూడు గంటలకు పూజించిన మంచి ఫలితము కలుగుతుంది. సాయంత్రం ఆరు గంటల సమయాన అనగా సూర్యాస్తమయమున శివపూజకు దివ్యమైన వేల.రాత్రి ఆరు నుంచి తొమ్మిది వరకు లక్ష్మీదేవిని పూజించిన ఆమె కరుణ కటాక్షములు ఎక్కువగా ఉంటాయి. తెల్లవారు జామున మూడు గంటలకు శ్రీమహా విష్ణువును పూజిస్తే వైకుంటవాసుడి దయ అపారంగా ప్రసరిస్తుంది.( ఇది నిబంధన మాత్రం కాదు. సమయానుకూలంగా కూడా మీ ఇష్ట దైవమును పూజించవచ్చు )
......................................................
కొన్ని ఆలయాల్లో ఏకంగా వివాహం కూడా జరిపిస్తున్నారు. హనుమంతుడు బ్రహ్మచారి. సూర్యుని కుమార్తె పేరు సువర్చల. హనుమ సూర్యుని వద్ద విద్యాబ్యాసం చేశాడు. ఆ సమయంలో సువర్చల హనుమని ఇష్టపడింది. విషయం తెలిసిన సూర్యుడు
విద్యాభ్యాసం అనంతరం హనుమని గురుదక్షిణగా సువర్చలాను వివాహమాడమన్నాడు. హనుమ కలియుగాంతం వరకు ఆగమన్నాడు.
ఆ తర్వాత వివాహం చేసుకుంటానని చెప్పాడు. కాబట్టి సువర్చలను హనుమ కలియుగం అంతమైన తర్వాతే వివాహం చేసుకుంటాడు. ఇచ్చిన మాట ప్రకారం, సూర్యునికిచ్చిన గురుదక్షిణ ప్రకారం.
.......................................................
మారిన జీవన పరిణామాల దృష్ట్యా, ఉద్యోగ నిర్వహనలవల్ల ఎక్కడికైనా వెళ్ళవలసి వస్తుంది. అలాంటప్పుడు దేవుణ్ణి ఈశాన్యాన పెట్టుకునే అవకాశం ఉండకపోవచ్చు. అలాంటప్పుడు దేవుడు పశ్చిమాన్ని చూసేలా ఏర్పాటు చేసుకోవాలి.
..............,......................................
పార్వతి,పరమేశ్వరులను దర్శించడానికిఅనేక మంది తాపసులు కైలసానికి వస్తారు.అందులో దిగంబర ఋషులు ఉండటంతో
సుబ్రమణ్యస్వామి హేళనగా నవ్వాడు. దానికి పార్వతిదేవి పుత్రుని మందలించి, మర్మాంగాలు సృష్టి వృద్ధి కోసం సృష్ణ్తిచినవి,
జాతికి జన్మస్థానాలు అని తెలియచెప్పింది. తల్లి జ్ఞాన భోధతో సుబ్రమణ్యస్వామి సర్పరూపం దాల్చాడు కొంతకాలం. జీవకణాలు పాముల్లా ఉంటాయని మనకు తెల్సిందే. ఆ తర్వాత వాటికి అధిపతి అయాడు. అందువల్లే జీవకణాల అధిపతి అయిన సుబ్రమణ్యస్వామి ని పూజిస్తే పిల్లలు పుట్టని దంపతులకు సంతానం కలుగుతుంది.
......................................................
వ్యాసుడు చెపుతుంటే వినాయకుడు ఘంటం ఎత్తకుండా వ్రాసింది మన భారత దేశ చివర గ్రామమైన “మాన ” లో. హిమాలయాల్లో ఉంది ఈ గ్రామం. భదిరినాత్ వెళ్ళినవారు తప్పనిసరిగా ఈ గ్రామాన్ని దర్శిస్తారు. “జయ” కావ్యమనే మహాభారతాన్ని వినాయకుడు వ్యాసును
పలుకు ప్రకారం రాస్తుంటే పక్కన ప్రవహిస్తున్న సరస్వతి నది తన పరుగుల,ఉరుకుల శబ్దాలకి అంతరాయం కలగకూడదని
మౌనం వహించి ప్రవహిస్తుంది. ఈ అధ్బుతాన్ని మీరు ఇప్పుడు కూడా చూడవచ్చు. ఆ ప్రదేశాన్ని దాటగానే మల్లి గలగలలు.
..................,..................................
సృష్టి లో సంభోగం చెయ్యని ప్రాణి నెమలి మాత్రమే. శ్రీ కృష్ణుని పదహారువేలమంది గోపికలు. అన్నివేల మంది భామలతో శ్రీ కృష్ణుడు సరససల్లాపాలు మాత్రమే చేశాడు. అల్లరి చేసి ఆడాడు. అంతవరకే మెలిగాడు. ఆవిషయాన్ని తెలియచేయడమే శ్రీకృష్ణుడి
పైనున్న నెమలిపించం భావం. శ్రీకృష్ణుడు కొంటెవాడు మాత్రమే. అయితే శ్రీకృష్ణుడు భోగిగా కనిపించే యోగీశ్వరుడు. వారందరితో పవిత్ర స్నేహసన్నితంగా ఉన్నానని పదపదే చెప్పడమే నెమలిని ధరించడం. నెమలి అంత పవిత్ర మయినది కనుకే మన జాతీయపక్షి అయింది.
................................
ముత్తయిదువ అని అర్థం. పసుపు, కుంకుమ, గాజులు, మెట్టెలు, మాంగల్యం. స్త్రీ ఈ అయిదు అలంకరణలతో కల కల లాడుతుండాలి. స్త్రీకి వివాహం అయిన తర్వాతే మెట్టెలు, మాంగల్యం వస్తాయి.
నిత్య జీవితంలో నిషిద్ధ కర్మలు
కర్మాచరణలో వర్ణాశ్రమ ధర్మముల ప్రకారము ఎవరికి ఎట్టి కర్మలు విధివిహితములో అవియే సత్కర్మలు. అటుల కానివి నిషిద్ధకర్మలు. అటువంటి నిషిద్ధకర్మలు ఏంటో తెలుసుకోవడం అవసరం. నిత్య జీవితంలో ఎదురయ్యే నిషిద్ధ కర్మల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఉత్తరాభిముఖంగా కూర్చుని భోజనం చేయరాదు. శ్రాద్ధకర్మ చేసే రోజు మాత్రమే ఉత్తరాభిముఖంగా కూర్చుని భోజనం చేయాలి. బొట్టు లేకుండా భోజనం చేయరాదు. భోజనంలోవెంట్రుక వస్తే ఆ భోజనం త్యజించవలెను. కనీసం నేతితో(ఆవు నెయ్యి శ్రేష్టం) అభికరించిన(శుద్ధి) తరువాత తినాలి.
దేవాలయ ముఖ ద్వారం పాదరక్షలు వేసుకుని దాట కూడదు. దేవాలయం గడపని తొక్కరాదు. ఈ రెండు చేసిన వారికి రాబోవు జన్మలో వికలాంగులుగా జీవించే అవకాశం ఉంది. ఈశ్వరుడికి కాళ్ళుపెట్టరాదు, గుడిలో సాష్టాంగనమస్కారం చేసేటపుడు అన్ని వైపులా గమనించుకుని ఈశ్వరుడి వైపు కాళ్ళు రాకుండా చూసుకుని సాష్టాంగనమస్కారం చేయవలెను. ఒకవేళ అలా కుదరకపోతే నుంచుని నమస్కారం చేస్తే సరి పోతుంది.
వారము ఫలితము
ఆదివారము ఒక మాసము ఆయువు తగ్గిపోతుంది
సోమవారముము ఏడు మాసములు ఆయువు వృద్ధి చెందును. పుత్రులు కోరుకునే గృహస్థులు, ఒకే ఒక పుత్రుడు గలవారు సోమవారంనాడు క్షారము చేయించుకోనగూడదు.
మంగళవారముము ఏనిమిది మాసములు ఆయువు తగ్గిపోతుంది
బుధవారముము ఐదు మాసములు ఆయువు వృద్ధి చెందును
గురువారముము పది మాసములు ఆయువు వృద్ధి చెందును. లక్ష్మిని కోరుకునేవారు గురువారమునాడు క్షారము చేయించుకోనగూడదు
శుక్రవారముము పదకొండు మాసములు ఆయువు వృద్ధి చెందును
శనివారముము ఏడు మాసములు ఆయువు తగ్గిపోతుంది
గృహంలో దేవతా విగ్రహాలు బొటనవేలు కన్నా పెద్దగా ఉండరాదు. మంత్ర పుష్పం, సుప్రభాతం కుర్చుని చదవరాదు. ఈశ్వరుడుకి పవళింపు సేవ నిలబడి చేయరాదు. బొట్టు, విభూతి లేదా కనీసం బొట్టు అయిన లేకుండా పూజ చేయకూడదు. ఈశ్వరుడికి, గురువుకి ఒక చేతితో నమస్కారం చేయరాదు అలా చేస్తే పైజన్మలో చేతులు లేకుండా జన్మించటం కానీ, మధ్యలో చేతులు పోవటం కానీ జరుగుతాయి.
స్త్రీలు తులసీదళాలు తుంచ రాదు. పురుషులు మాత్రమే తుంచ వలెను. పౌర్ణమి, అమావాస్యనాడు, రవి సంక్రమణ, తైలాభ్యంగనస్నానం చేసిననాడు. త్రిసంధ్యలకాలంలో, మైలరోజులలో, రాత్రి ధరించి ఉన్న దుస్తులతోను, స్నానం చేసి శుభ్రమైన వస్త్రం ధరించకుండా, తులసిని తుంచడం మహాపాపం. అలా చేయడం అంటే సాక్షాత్తూ శ్రీమహావిష్ణువు శిరస్సునే తుంచినట్లే.
ధర్మపత్ని జీవించి ఉండగా పురుషుడు పరస్త్రీ సంగమం చేయరాదు అలాచేస్తే, సంవత్సరం పాటు వెళ్ళిన ఇంటికి వెళ్ళకుండా వెళ్లి తను చేసిన తప్పు చెప్పి ఆ ఇంట్లో వాళ్ళు వేసిన భిక్షమాత్రమేస్వీకరిస్తూ జీవించాలి. పూర్తిగా శిరోముండనం చేసుకోకూడదు కనీసం శిఖ ఉంచుకోవాలి. అలా చేసుకుంటే ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. పూర్తిగా శిరోముండనం చేసుకుంటే వైదిక క్రియలకి పనికిరాదు. ఏకాదశి, చతుర్దశి, అమావాస్య, పూర్ణిమా, సంక్రాంతి, వ్యతిపాతము, విష్టి, ఇత్యాదులయందు, వ్రత దినములయందు, శ్రాద్ధ దినముల యందు, మంగళ, శనివారముల యందు క్షారకర్మ పనికిరాదు.
............................................,..........
- మన కాళ్ళు...ఈ విశ్వాన్ని మొత్తం నడచి రాలేవు. వాటికి అంత శక్తి లేదు.
- మన చేతులు..కైలాస పర్వతాన్ని ఎత్తిపట్టుకుని మోయలేవు. వాటికి అంత శక్తి లేదు.
- మన కళ్ళు...అతి విసృతమైన పదార్ధాన్నిగానీ.. అతి సూక్ష్మమైన పదార్ధాన్నిగానీ... చూడలేవు. వాటికి అంత శక్తి లేదు.
ఆకాశం మన కంటికి కనిపించదు. చూస్తున్నామని అనుకోవడం మన భ్రమ. అతి సూక్ష్మక్రిమి అయిన ‘అమీబా’ని సూక్ష్మదర్శిని (మైక్రోస్కోప్) సాయంతో చూస్తున్నాం కదా అని మీరు అడగవచ్చు. మన కళ్ళకు అంత శక్తి లేదు కనుకనే... మనం సూక్ష్మదర్శినిని ఆశ్రయించవలసి వస్తుంది.
మరి ఈ కళ్ళతో ‘దేవుని’ చూచిన ఋషులు వున్నారుకదా..అని మీరు అడగవచ్చు.
- కళ్ళు భౌతికమైన పదార్ధాలను మాత్రమే చూడగలవు.
- మనోనేత్రం అభౌతికమైన పదార్ధాలను దర్శిస్తాయి.
‘దేవుడు’ మనోనేత్రానికి దర్శనమిస్తాడు. తను సంకల్పించినప్పుడు మాత్రం మన భౌతిక నేత్రాల ముందు ప్రత్యక్షమౌతాడు. చూడడానికి, దర్శించడానికి ఉన్న తేడా అది.
మరి మనోనేత్రంతో ‘దేవుని’ దర్శించడం ఎలా? అన్నదే ఈనాటి మన ప్రశ్న.
పంచభూతాల శక్తుల సమ్మిళితమే...భూలోక జీవుల శరీర నిర్మాణం. అందుకే... ఈ లోకంలోని జీవులన్నీ భూమిని ఆశ్రయించి జీవిస్తూంటాయి. పంచభూతాల తత్త్వాలు మన శరీరాన్ని ఆవహించి ఉన్నంత వరకూ...,వాటికి అతీతంగా ఉండే ‘పరమాత్మ’ మన కళ్ళకు దర్శనమివ్వడు. ఆ దేవదేవుని దర్శించాలంటే...పంచభూత తత్త్వాలనూ, వాటి గుణాలనూ, త్యజించాలి. ఏమిటి వాటి గుణాలు, తత్త్వాలు...అంటే....
- ఆకాశానికి ఉన్న ఒకే ఒక గుణం...శబ్దం.
- వాయువుకు ఉన్నగుణాలు రెండు...శబ్దము, స్పర్శ.
- అగ్నికి ఉన్న గుణాలు మూడు...శబ్ద, స్పర్శ, రూపములు.
- జలముకు ఉన్న గుణాలు నాలుగు...శబ్ద, స్పర్శ, రూప, రసము(రుచి)లు.
- భూమికి ఉన్న గుణాలు ఐదు...శబ్ద, స్పర్శ,రూప, రస, గంథాలు.
ఈ ఐదు గుణాలూ...పాంచభౌతిక తత్త్వాలు గల మన శరీరానికి ఉన్నాయి కనుకనే మనం భూమిని ఆశ్రయించి జీవిస్తున్నాం.
- జలము...‘గంథము’ అనే గుణాన్ని త్యాగం చేయడం వల్ల, మనం నీటిని చేతితో పట్టుకోలేము. నీటికి మన చేతిని ఆధారంగా మాత్రమే ఉంచగలం. కొంతసేపటికి ఆ నీరు ఆవిరైపోతుందేగనీ.., మనం బంధించలేము.
- అగ్ని...‘రస, గంథము’లనే గుణాలను త్యాగం చేయడంవల్ల, అగ్నిని కళ్ళతో చూడగలమే గానీ, కనీసం తాకనైనా తాకలేము. తాకితే శిక్షిస్తుంది.
- వాయువు...‘రస,గంథ, రూపము’లనే గుణాలను త్యాగం చేయడంవల్ల, మనం వాయువును ఈ కళ్ళతో చూడనైనా చూడలేము. వాయువే తనంతట తాను మనలను స్పృశించి, తన ఉనికిని మనకు తెలియజేస్తుంది.
- ఆకాశం...‘రస, గంథ, రూప, స్పర్శ’లనే గుణాలను త్యాగం చేయడంవల్ల, అది మన కళ్ళకు కనిపించకుండా, తను ఉన్నానని మనలను భ్రమింప చేస్తుంది.
కేవలం ఒకే ఒక గుణమున్న (శబ్దం) ఆకాశాన్నే మనం చూడలేనప్పుడు..., ఏ గుణము లేని ఆ ‘నిర్గుణ పరబ్రహ్మ’ ఎలా ఈ భౌతిక నేత్రానికి కనిపిస్తాడు? అలా చూడాలంటే మన మనోనేత్రాన్ని తెరవాలి. దాన్ని తెరవాలంటే..., పాంచభౌతిక తత్త్వాలైన గుణాలను, అనగా...ప్రాపంచిక విషయ వాసనలను త్యజించాలి. అప్పుడు నీవు ‘నిర్గుణుడ’వు అవుతావు. అప్పుడు నీవే ‘పరమాత్మ’వు అవుతావు. నిన్ను నీలోనే దర్శించుకుంటావు. అదే ‘అహం బ్రహ్మాస్మి’ అంటే. ‘నిన్ను నీవు తెలుసుకోవడమే’ దైవాన్ని దర్శించడమంటే. అదే దైవ సాక్షాత్కారం అంటే.
సోమవారముము ఏడు మాసములు ఆయువు వృద్ధి చెందును. పుత్రులు కోరుకునే గృహస్థులు, ఒకే ఒక పుత్రుడు గలవారు సోమవారంనాడు క్షారము చేయించుకోనగూడదు.
మంగళవారముము ఏనిమిది మాసములు ఆయువు తగ్గిపోతుంది
బుధవారముము ఐదు మాసములు ఆయువు వృద్ధి చెందును
గురువారముము పది మాసములు ఆయువు వృద్ధి చెందును. లక్ష్మిని కోరుకునేవారు గురువారమునాడు క్షారము చేయించుకోనగూడదు
శుక్రవారముము పదకొండు మాసములు ఆయువు వృద్ధి చెందును
శనివారముము ఏడు మాసములు ఆయువు తగ్గిపోతుంది.
ఈశ్వరుడికి వీపు చూపరాదు. ఈశ్వరుడి ఎదురుగా నిలబడి ఆత్మప్రదక్షిణ చేయరాదు. ఈశ్వరుడికి చేసే దీపారాధన పరదేవతతో సమానం. ఆ దీపారాధనతో పుల్లలు కానీ, సాంబ్రాణికడ్డికానీ, హారతికర్పూరంకానీ మరి ఏదైనా కానీ వెలిగించకూడదు. పూజ సమయమున ఈశ్వరుడు మన కంటే ఎత్తులోవుండాలి, అలానే పూజా వస్తువులు కుడి వైపు నుంచి తీసుకోవాలి. వెడం చేయి పూజా విధులలో నిషేధం. ఇక ఆచమనం చేసేటప్పుడు శబ్దం రాకూడదు.
ఈశ్వర నిర్మాల్యం కాలితో తొక్కరాదు. అలాచేస్తే ఈ జన్మలో చేసుకున్న పుణ్యంతో పాటు పూర్వ జన్మలో చేసుకున్న పుణ్యం కూడా నశించును. రుద్రాక్షలు ధరించేవారు మద్యం, మాంసము, ఉల్లి, వెల్లుల్లి, మునగ, శ్లేషాత్మక పదార్ధాలు తినకూడదు.
పురుషులు మాత్రమే తుంచ వలెను. పౌర్ణమి, అమావాస్యనాడు, రవి సంక్రమణ, తైలాభ్యంగనస్నానం చేసిననాడు. త్రిసంధ్యలకాలంలో, మైలరోజులలో, రాత్రి ధరించి ఉన్న దుస్తులతోను, స్నానం చేసి శుభ్రమైన వస్త్రం ధరించకుండా, తులసిని తుంచడం మహాపాపం. అలా చేయడం అంటే సాక్షాత్తూ శ్రీమహావిష్ణువు శిరస్సునే తుంచినట్లే.
స్త్రీలు జుట్టు విరబోసుకుని ఇంట్లో తిరగరాదు. ఇలా స్త్రీలు చేస్తే ఇంటికి, ఇంట్లో ఉన్నవారికి అశుభం. అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు. స్త్రీలు జుట్టు విరబోసుకుని భర్తకి కనపడరాదు. అలాకనపడితే భర్తకి గండం. బయటకి వెళుతున్నపుడు స్త్రీ జుట్టు విరబోసుకుని కనపడితే వెనక్కి ఇంట్లోకి వచ్చి కాళ్ళు కడుక్కుని కొంచం సేపు కుర్చుని వెళ్ళాలి. స్త్రీలు తాటంకాలు (చెవి దిద్దులు) లేకుండా భర్తకి కనపడరాదు. అలాకనపడితే భర్తకి గండం.
-
SRI BHAGAVATM_EPISODES_DOWNLOAD LINK: https://mega.nz/#F!AZZxhJQB!K8sQpIbEaPoY_1cFb7YYL SRI BHAGAVATAM ETV EPISODES Loading...
-
LORD SHIVA SONGS MY COLLECTION https://my.pcloud.com/publink/show? code=kZvotdZe0aFbupW6CuMi2OlPgPOrLUIyN4y నేను సేకరించిన lord shiva ...